సన్ టీవీ నెట్ వర్క్ ప్రసారాలు నిలిచిపోనున్నాయా..? ముఖ్యమంగా తెలుగువారికి జెమినీ టీవీగా పరిచయమైన నెట్ వర్క్ గ్రూప్ ప్రసారాలు ఆగిపోతాయా? తెలుగువారిని సుమారుగా రెండు దశాబ్ధాల అలరిస్తున్న జెమినీ సీరియల్స్, జెమినీ మూవీస్ (సినిమాలు), జెమినీ కామెడీ, జెమినీ సాంగ్స్ (పాటలు) ఇలా జెమినీ ప్రసారాలన్నీ దూరమవుతాయా? అంటే.. రమారమి అలాందేదో జరగబోతోందని.. కేంద్ర హోంశాఖ వ్యవహారం చూస్తే అనిపిస్తోంది. సన్ టీవీ నెట్ వర్క్కు భద్రతా అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్రహోంశాఖ మరోమారు స్పష్టం చేసింది. సన్ నెట్ వర్క్కు భద్రతా పరమైన అనుమతి ఇవ్వాలని ఇటీవలే అటార్నీ జనరల్ సలహా ఇచ్చారు. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కూడా ఇదే సిఫార్స్ చేసింది. అయినా కేంద్రహోంశాఖ పట్టించుకోలేదు. సన్ నెట్ వర్క్కు భద్రతాపరమైన అనుమతి ఇచ్చేదిలేదని తేల్చి చెప్పింది. ఈ సంస్థ యజమానులు పలు నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంది.
అభిప్రాయాలు ఎవరైనా వ్యక్తం చేయవచ్చని, అంతమాత్రాన హోంశాఖ వైఖరి మారదని స్పష్టం చేసిన కేంద్ర హోంశాఖ... పలు వివాదాల నడుము చిక్కుకున్న ఛానెల్ యజమానులు, పలు కేసులలో నిదితులుగా అభియోగాలను కూడా ఎదుర్కోంటున్నారని తెలిపింది. కేంద్ర టెలికాం శాఖ మాజీ మంత్రి దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధి మారన్ నిర్వహిస్తున్న సన్ నెట్వర్క్లో 33 ఛానళ్లు, పలు ఎఫ్ఎం స్టేషన్లు ఉన్నాయి. దయానిధి మంత్రిగా ఉన్నప్పుడు 300 టెలిఫోన్ లైన్లను సన్ నెట్వర్క్కు కేటాయించడంపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. సంస్థ యాజమాన్యంపై మణి లాండరింగ్ సహా పలు కేసులు ఉన్నాయి. ఎయిర్టెల్, మాక్సెస్ స్కామ్లో మారన్ సోదరులు నిందితులు. వీరికి సంబంధించిన రూ. 742 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ ఇప్పటికే జప్తు చేసింది. దీంతో సన్ టీవీకి భద్రతాపరమైన అనుమతులు ఇవ్వడానికి చట్టప్రకారం ఎలాంటి అనుమతి లేదని హోంశాఖ తెలిపింది.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more