పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వెస్ట్ బెంగాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. జోరసాన్ కో పోలిస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన ఓ సభలో అభిషేక్ ముఖర్జీ కళ్లు పీకేస్తాం, చేతులు నరికేస్తాం అంటూ విపక్షాలను హెచ్చరిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. విపక్షాలు అభిషేక్ ముఖర్జీ వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని పట్టబట్టిన నేపథ్యంలో ఎట్టకేలకు రంగంలోకి దిగిన జోరసాన్ కో పోలీసులు కేను సమోదు చేశారు.
ఇంతకీ అభిషేక్ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలు ఏమిటో తెలుసా..? మా కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తే కళ్లు పీకేయడం ఖాయమని కోల్కత్తాలో జరిగిన తృణమూల్ సభలో ఆయన హెచ్చరికలు జారీ చేశారు. వేలెత్తి చూపితే చేతులు నరికేస్తామని అభిషేక్ బెనర్జీ బెదిరించారు. 27 ఏళ్ల అభిషేక్ తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన దూకుడు సీఎం మమతకు కాస్త ఇబ్బందిగానే పరిణమించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేపీ మండి పడుతున్నాయి. కార్యకర్తలను రెచ్చగొట్టడం తగదని కాంగ్రెస్ గుర్తు చేసింది. ఎన్నికలకు భయపడి మమత తన అనుచరులను రెచ్చగొడుతున్నారని బీజేపీ ఆరోపించింది. కాంగ్రెస్ నేత పీఎల్ పునియా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కళ్లు పీకేస్తాం, చేతులు నరికేస్తాం లాంటి బెదిరింపులు గర్హనీయమని అన్నారు. పార్టీ మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలన్నారు. మాట్లాడే తీరు మర్యాద పూర్వకంగా ఉండాలని పునియా సూచించారు. ఇలాంటి వ్యాఖ్యల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోవాలని ఆయన అన్నారు. ఈ విషయంలో మమతా బెనర్జీ తన మేనల్లుడిని కాపాడే ప్రయత్నం చేయకూడదని పునియా పేర్కొన్నారు.
బీజేపీ అధికార ప్రతినిధి నరసింహారావు మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యుడుగా ఉన్నటువంటి నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. హింసను ప్రేరేపించేందుకు వాళ్లు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. మమతా బెనర్జీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు భయపడుతున్నారని, హింసకు దిగడం ఒక్కడే ఆమె ముందున్న మార్గంలా కనిపిస్తోందని ఆయన విమర్శించారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more