రాజకీయాల్లో ఒక మంత్రిపై మరొక మంత్రి వ్యాఖ్యలు చేసుకోవడం సహజమే కానీ.. ఏకంగా అధ్యక్షుడిపైనే విమర్శలు గుప్పించడం తగదు. ఒకవేళ అలా జరిగితే మాత్రం.. సదరు మంత్రికి తగిన రీతిలో ట్రీట్ మెంట్ లభిస్తుంది. ఈ విషయాన్ని విస్మరించిన ఓ మంత్రిగారి సతీమణి.. ఏకంగా అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపైనే ‘బ్లాక్’ జోక్ వేసి తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంటోంది. ఆమె ట్విటర్ లో ఒబామాపై వేసిన బ్లాక్ జోక్ ని అందరూ ఖండించడంతో.. ఆమె చేసిన తప్పును తెలుసుకుని వెంటనే క్షమాపణలు చెప్పింది. ఇంతకీ ఆ మంత్రి ఎవరు? ఆమె ఏం ట్వీట్ చేసింది? అని అనుకుంటున్నారా.. ఆ వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!
వివరాల్లోకి వెళ్తే.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజియన్ నెతన్యాహు మంత్రివర్గంలో సిల్వాన్ షాలోమ్ అనే వ్యక్తి మంత్రిగా వున్నారు. ఆయన సతీమణి అయిన జూడీ షాలోమ్ ట్విటర్ లో ఒబామాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘ఒబామా కాఫీ’ అంటే ఏంతో తెలుసా? అది బ్లాక్ అండ్ వీక్’ అని ఆమె ట్విటర్ వేదికగా ట్వీట్ చేసింది. అంతే! ఎరక్కపోయి ఇరుక్కుపోయింది. జోక్ అనుకుని ట్వీట్ చేస్తే అది ఆమెకు పెద్ద ఝలక్ ఇచ్చింది. ఈమె చేసిన ఈ ట్వీట్ పై పలువురు ఒక్కసారిగా దాడికి దిగారు. ఆ ట్వీట్ కి రివర్స్ లో ఈమెపై విమర్శలు గుప్పించేశారు. దీంతో తీవ్ర ఆందోళనలకు గురైన ఆమె.. తాను చేసిన ట్వీట్ కి క్షమాపణలు కోరుతూ తన మాటలను తొలగిస్తున్నట్లుగా తెలిపింది.
చివరగా షాలోమ్ తాను చేసిన ట్వీట్ కి వివరణ ఇచ్చుకుంది. తాను ఏ ఒక్క జాతినో, మతాన్నో కించపరుస్తూ ఆ ట్వీట్ చేయలేదని, కేవలం జోక్ నేపథ్యంలో అలా పేర్కొన్నానని తెలిపింది. ఏదేమైనా.. నిన్నటివరకు ప్రపంచానికి అంతగా తెలియని ఈవిడ.. ఒబామాపై ‘బ్లాక్’ జోక్ వేసి ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచిపోయింది. ఈ మొత్తం తతంగాన్ని చూస్తుంటే.. బహుశా పబ్లిసిటీ కోసమే ఆమె ఒబామాపై ఆ విధమైన ట్వీట్ చేసిందేమోనన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more