బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎందుకున్న టీమిండియా.. పరుగలు వేటలో తడబడుతోంది. గత వన్డే మ్యాచ్ మిగిల్చిన ఓటమి గాయం నుంచి కోలుకుని రాణిస్తారనుకున్న ధోని సేన.. పరుగుల కోసం అపసోపాలు పడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దోనిసేన.. 30 ఓవర్లు ముగిసే సరికి 142 పరుగులు మాత్రమే సాధించి.. నాలుగు విక్కెట్లను కోల్పయింది. ప్రస్తుతం క్రీజ్ లో వున్న వంద పరుగుల లక్ష్యాన్ని అతి కష్టంగా చేధించిన టీమిండియా.. ఈలోపు టాప్ ఆర్డర్ కు చెందిన నాలుగు విక్కెట్లను పోగొట్టుకుంది. ఓపెనర్ రోహిత్ శర్మ పరుగులేమి చేయకుండానే డకౌట్ గా వెనుదిరడంతో భారత్ వికెట్ల పతనం ప్రారంభమైంది.
ఆ తరువాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ 22 పరుగలు మాత్రమే చేసి వెనుదిరగడంతో టీమిండియా రెండో విక్కెట్ కోల్పోయింది. ఆ తరువాత క్రీజ్ లోకి వచ్చిన అంబటి రాయుడు పరుగులేమి చేయకుండానే వెనుదిరిగాడు. ఆ తరువాత మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 54 పరుగుల వద్ద ఔటయ్యాడు... సూపర్ ఫామ్ లో వున్న అజ్యింక రహానేను ఈ మ్యాచ్ ను తప్పించిన కెప్టెన్ ధోని ఆయన స్థానంలో అంబటి రాయుడికి స్థానం కల్పించారు. అయితే ధోని అంచనాలు తలకిందులై.. అంబటి రాయుడు పెద్దగా స్కోరు సాధించకుండానే వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజ్ లో జట్టు సారధి మహింద్ర సింగ్ ధోణి, 32 పరుగులతో రాణిస్తుండగా, సురేష్ రైనా 24 పరుగులతో అడుతున్నారు.
బంగ్లా బౌలర్లు నాసిర్ హుస్సన్ కు రెండు వికెట్లు లభించగా, ముస్తాఫిజుర్ రెహమాన్, రుబెల్ లకు చరో విక్కెట్ లభించింది. కాగా అటు బౌలింగ్ లోనూ ధోని పలు మార్పులు చేశాడు. ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మల స్థానంలో అక్షర్ పటేల్, ధావల్ కులకర్ణిలకు జట్టులోకి తీసుకున్నారు. మూడు వన్డలే సీరిస్ లో భాగంగా జరుగుతున్న రెండో వన్డేలో గెలిచి 1-1తో స్కోరును సమం చేసుకోవాలని రంగంలోకి దిగిన ధోనిసేన ఈ మ్యాచ్ ను ఖచ్చితంగా గెలవాల్సింది. ఈ మ్యాచ్ లో భారత్ ఓటమి పాలైన నేపథ్యలో సీరిస్ బంగ్లాదేశ్ వశం అవ్వడం ఖాయం.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more