భర్తే తన సర్వస్వమని భావించిన ఓ భార్యకు తీరని నిరాశే మిగిలింది. కన్నవారి ప్రేమను సైతం వదులుకుని ఎంతో నమ్మకంతో భర్త ఇంట్లో అడుగుపెట్టిన ఆమెకు నరకం అనుభవించక తప్పలేదు. రోజూ అతడు పెట్టే టార్చర్ భరిస్తూ తన బాధను దిగమింగుకునేది. ఇలాగే రోధిస్తూ అతనితో జీవనం కొనసాగించింది. ఇంతలో వీరికి ఇద్దరు కుమారులు పుట్టారు. కానీ.. అతగాడి ఆగడాలు మాత్రం ఇంకా పెరుగుతూనే వచ్చాయి. ప్రేమను ఇచ్చిన భార్యపై కక్ష పెంచుకుంటూ రాక్షసుడిలా మారాడు. ఎంతగా అంటే.. కన్నకొడుకులనే అత్యంత దారుణంగా చంపేసి తనలో దాగిన రాక్షసత్వాన్ని చూపించాడు. కడుపుకోతతో రోధిస్తున్న తన భార్యను చంపేవరకు నిద్రపోనంటూ ప్రకటన చేశాడా కర్కశుడు.
వివరాల్లోకి వెళ్తే.. చాగలమర్రిలో హుసేన్బాషా, ఖాజాబీ అనే దంపతులు జీవనం కొనసాగించేవారు. వ్యసనాలకు బానిసైన హుసేన్.. ప్రతిరోజూ తన భార్యమీద చెయ్యి చేసుకునేవాడు. అయినా అతగాడు ఆగడాలు భరిస్తూ జీవనం కొనసాగించింది. ఆమె గర్భవతి అయినప్పటికీ అతగాడు ఆమెను వేధిస్తూ వుండేవాడు. అప్పటికీ ఆమె మౌనంగానే వుండేది. కడుపులో వున్న బిడ్డలను నవమాసాలు మోసింది. వెన్నువిరిగే నొప్పులను పంటి బిగువున భరించి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. తన భర్త ఒళ్లంతా గాయాలు చేస్తున్నా పిల్లల ముఖం చూసి మౌనంగా రోదించింది. తప్పతాగి అర్ధరాత్రిళ్లు ఆ మానవమృగం చేసే అకృత్యాలను భరిస్తూ వచ్చింది. పుట్టింటికి వెళ్తే కాస్త మెరుగవుతాడని పిల్లలతో పయనమైంది. అయితే తాను తన పిల్లలను తీసుకెళ్తానని హుసేన్ వెంట తీసుకెళ్తుంటే.. తండ్రే కదా ఏమి చేస్తాడులే అనుకుంది. కానీ.. అతగాడు పిల్లలను ఇంటికి తీసుకెళ్లిన అనంతరం ఫోన్ చేసి పిల్లల్ని చంపేస్తానని చెప్పాడు. అతడు చెప్పినట్లుగా అన్నంత పని చేశాడు. తన పిల్లల్ని అత్యంత దారుణంగా చంపేశాడు. దీంతో తానింక బతికీ లాభం లేదని ఖాజాబీ జీవచ్ఛవంలా మారింది.
తన ఇద్దరు పిల్లలను గొంతు కోసి దారుణంగా చంపిన హుసేన్బాషా మరింత హల్చల్ చేశాడు. భార్య ఖాజాబీని కూడా చంపేవరకు పోలీసులకు లొంగిపోనని ప్రకటించాడు. ఈమేరకు బుధవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో జామియా మసీదు కాలనీకి వచ్చి కాలనీవాసులతోపాటు కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశాడు. కాలనీలోని మహబుబ్ బాషా ఇంటి వద్దకు వచ్చిన అతడు ఇంటి తలుపులకు రాళ్లతో కొట్టాడు. కాలనీలోని కొందరు అతడిని పట్టు కునేందుకు ప్రయత్నించగా పక్కనే ఉన్న సమాధుల వైపు పరారయ్యాడు. సొంత కుమారులనే అతి కిరాతకంగా చంపిన హుసేన్బాషా తమను ఏం చేస్తాడో అనే భయంతో ఆ చీకట్లోకి పోయేందుకు కాలనీ వాసులు సాహసించలేక పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వచ్చేలోపు హంతకుడు పారిపోయాడు.
అనంతరం జామియా మసీదు కాలనీలోని తన బావ లాల్బాషకు అర్ధరాత్రి 2.58 నిమిషాలకు సెల్ నెంబర్ 7680855067 ద్వారా మిస్డ్ కాల్ ఇచ్చాడు. తిరిగి 3.00 గంటలకు ఫోన్ చేసి ‘భార్య ఖాజాబీని చంపే వరకు నన్ను ఎవరు పట్టుకోలేరని, తన గురించి ఎవరు వెదికినా వారిని చంపేస్తాన’ని బెదిరించినట్లు స్థానికులు తెలిపారు. ఆ నంబర్కు తిరిగి లాల్బాషాతోనే పోలీసులు ఫోన్చేయించగా ‘ఎవరు ఫోన్ చేయించారో తెలుసునని మీ పక్కన పోలీసులు ఉన్నారని’ చెప్పి కట్ చేశా డు. ఇదిలా ఉంటే కుమారుల అంత్యక్రియలు ముగియగానే ఖాజాబీ తిరిగి తన తల్లిదండ్రుల ఊరైన ప్రొద్దుటూరుకు వెళ్లి పోయారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more