A Man named Hussain Basha Killed His own 2 sons | Husband warns wife he will not surrender until kill his wife

Hussain basha killed 2 sons and warns wife he will not surrender until kill his wife

hussain basha, khajabi, hussain basha crime news, father killed his sons, husband death warn to wife, husband beating wife, husbands crime news, husband hussain basha, wife khajabi

Hussain Basha Killed 2 sons and warns wife he will not surrender until kill his wife : A Man named Hussain Bhasha Killed His own 2 sons and warns to family members that he will not surrender until kill his wife.

‘భార్యను ‘సఫా’ చేసేవరకు పోలీసులకు లొంగేదిలేదు’

Posted: 06/19/2015 10:46 AM IST
Hussain basha killed 2 sons and warns wife he will not surrender until kill his wife

భర్తే తన సర్వస్వమని భావించిన ఓ భార్యకు తీరని నిరాశే మిగిలింది. కన్నవారి ప్రేమను సైతం వదులుకుని ఎంతో నమ్మకంతో భర్త ఇంట్లో అడుగుపెట్టిన ఆమెకు నరకం అనుభవించక తప్పలేదు. రోజూ అతడు పెట్టే టార్చర్ భరిస్తూ తన బాధను దిగమింగుకునేది. ఇలాగే రోధిస్తూ అతనితో జీవనం కొనసాగించింది. ఇంతలో వీరికి ఇద్దరు కుమారులు పుట్టారు. కానీ.. అతగాడి ఆగడాలు మాత్రం ఇంకా పెరుగుతూనే వచ్చాయి. ప్రేమను ఇచ్చిన భార్యపై కక్ష పెంచుకుంటూ రాక్షసుడిలా మారాడు. ఎంతగా అంటే.. కన్నకొడుకులనే అత్యంత దారుణంగా చంపేసి తనలో దాగిన రాక్షసత్వాన్ని చూపించాడు. కడుపుకోతతో రోధిస్తున్న తన భార్యను చంపేవరకు నిద్రపోనంటూ ప్రకటన చేశాడా కర్కశుడు.

వివరాల్లోకి వెళ్తే.. చాగలమర్రిలో హుసేన్‌బాషా, ఖాజాబీ అనే దంపతులు జీవనం కొనసాగించేవారు. వ్యసనాలకు బానిసైన హుసేన్.. ప్రతిరోజూ తన భార్యమీద చెయ్యి చేసుకునేవాడు. అయినా అతగాడు ఆగడాలు భరిస్తూ జీవనం కొనసాగించింది. ఆమె గర్భవతి అయినప్పటికీ అతగాడు ఆమెను వేధిస్తూ వుండేవాడు. అప్పటికీ ఆమె మౌనంగానే వుండేది. కడుపులో వున్న బిడ్డలను నవమాసాలు మోసింది. వెన్నువిరిగే నొప్పులను పంటి బిగువున భరించి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. తన భర్త ఒళ్లంతా గాయాలు చేస్తున్నా పిల్లల ముఖం చూసి మౌనంగా రోదించింది. తప్పతాగి అర్ధరాత్రిళ్లు ఆ మానవమృగం చేసే అకృత్యాలను భరిస్తూ వచ్చింది. పుట్టింటికి వెళ్తే కాస్త మెరుగవుతాడని పిల్లలతో పయనమైంది. అయితే తాను తన పిల్లలను తీసుకెళ్తానని హుసేన్ వెంట తీసుకెళ్తుంటే.. తండ్రే కదా ఏమి చేస్తాడులే అనుకుంది. కానీ.. అతగాడు పిల్లలను ఇంటికి తీసుకెళ్లిన అనంతరం ఫోన్ చేసి పిల్లల్ని చంపేస్తానని చెప్పాడు. అతడు చెప్పినట్లుగా అన్నంత పని చేశాడు. తన పిల్లల్ని అత్యంత దారుణంగా చంపేశాడు. దీంతో తానింక బతికీ లాభం లేదని ఖాజాబీ జీవచ్ఛవంలా మారింది.

తన ఇద్దరు పిల్లలను  గొంతు కోసి దారుణంగా చంపిన  హుసేన్‌బాషా మరింత హల్‌చల్‌ చేశాడు. భార్య ఖాజాబీని కూడా చంపేవరకు పోలీసులకు లొంగిపోనని ప్రకటించాడు. ఈమేరకు బుధవారం అర్ధరాత్రి  2 గంటల సమయంలో జామియా మసీదు కాలనీకి వచ్చి కాలనీవాసులతోపాటు కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశాడు. కాలనీలోని మహబుబ్ బాషా ఇంటి వద్దకు వచ్చిన అతడు ఇంటి తలుపులకు రాళ్లతో కొట్టాడు. కాలనీలోని కొందరు అతడిని  పట్టు కునేందుకు ప్రయత్నించగా పక్కనే ఉన్న సమాధుల వైపు పరారయ్యాడు. సొంత కుమారులనే అతి కిరాతకంగా చంపిన హుసేన్‌బాషా తమను ఏం చేస్తాడో అనే భయంతో ఆ చీకట్లోకి పోయేందుకు కాలనీ వాసులు సాహసించలేక పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వచ్చేలోపు హంతకుడు పారిపోయాడు.

అనంతరం  జామియా మసీదు కాలనీలోని తన బావ లాల్‌బాషకు అర్ధరాత్రి 2.58 నిమిషాలకు సెల్ నెంబర్ 7680855067 ద్వారా మిస్డ్ కాల్ ఇచ్చాడు. తిరిగి 3.00 గంటలకు ఫోన్ చేసి ‘భార్య ఖాజాబీని చంపే వరకు నన్ను ఎవరు పట్టుకోలేరని, తన గురించి ఎవరు వెదికినా వారిని చంపేస్తాన’ని బెదిరించినట్లు స్థానికులు తెలిపారు. ఆ నంబర్‌కు తిరిగి లాల్‌బాషాతోనే  పోలీసులు ఫోన్‌చేయించగా ‘ఎవరు ఫోన్ చేయించారో తెలుసునని మీ పక్కన పోలీసులు ఉన్నారని’ చెప్పి కట్ చేశా డు. ఇదిలా ఉంటే కుమారుల అంత్యక్రియలు ముగియగానే ఖాజాబీ తిరిగి తన తల్లిదండ్రుల ఊరైన ప్రొద్దుటూరుకు వెళ్లి పోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : hussain basha  khaja bi  crime news  

Other Articles