తెలంగాణ ప్రభుత్వ ఖజానా గురించి మాట్లాడాల్పి వస్తే దేశంలో అధికంగా మిగులు బడ్జెట్ కలిగిన రెండో రాష్ట్రంగా ఉంది. అయితే మిగులు బడ్జెట్ ఉంది కాబట్టి తెలంగాణ సర్కార్ భారీగా కొత్త పథకాలను ప్రపోజ్ చేస్తూ.. వాటిని అమలు చెయ్యడానికి ముందుకు వస్తోంది. అయితే తెలంగాణ ఖజానా పరిస్థితి ప్రస్తుతం కష్టంగా ఉందట. అవును మీరు చదివింది నిజం, తెలంగాణ సర్కార్ చేస్తున్న పలు కార్యక్రమాలకు నిధులను పూర్తి స్థాయిలోకేటాయించే పరిస్థితిలో ఆర్థిక శాఖ లేదు. అందుకే ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అత్యవసరంగా మీటింగ్ ఏర్పాటు చేసి తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై చర్చించారు. ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండు బెడ్ రూంల స్కీంకు మొత్తంగా రెండువేల ఐదు వందల కోట్లు, కొత్తగా భర్తీ చెయ్యనున్న ఇరవైఐదు వేల ఉద్యోగాల కోసం తొంభై కోట్లు, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తే అదనంగా తొమ్మిది కోట్ల రూపాయల భారం పడనుంది. ఇలా తెలంగాణ ప్రభుత్వం మీద ఉన్న భారం కాకుండా కొత్తగా మరింత భారం పడనుంది.
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు తెలంగాణ సర్కార్ చేసిన బారీ వ్యయం గురించి కూడా ఈ సందర్థంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబందించి తెలంగాణ సర్కార్ కష్టాల్లో ఉంది అని వార్తలు రావడంపై ఈటెల రాజేందర్ స్పందించారుే. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై కేవలం రెండు నెలలు మాత్రమే అయింది కాబట్టి ఇంకా పది నెలల టైం ఉన్నందున అలాంటిది ఏమీ లేదని అన్నారు. ఇప్పటికే పన్ను వసూలులో 85 నుండి 90శాతం సక్సెస్ అయిన తెలంగాణ సర్కార్ రానున్న నెల నుండి వంద శాతం వసూలు చేస్తామని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. మరి దేశంలోనే పెద్ద బడ్జెట్ లను ప్రవేశపెట్టిన రాష్ట్రాల జాబితాలో ఉన్న తెలంగాణ సర్కార్ కు ఇలా కరెన్సీ కష్టాలు రావడం ఏంటో అని కొందరు అనుకుంటున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందో చూడాలి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more