ప్రస్తుతకాలంలో నీటిసమస్య ఎంతో ఎక్కువగా వుంది. రానున్నరోజుల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా మారిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే.. నీటిశాతం పూర్తిగా తగ్గుతూ వస్తోంది. ముఖ్యంగా గ్రామాల్లో అయితే త్రాగడానికి కాదుకదా.. కనీస అవసరాలను తీర్చుకోవడానికి కూడా నీళ్లు దొరక్క ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఇటువంటి సమస్యలపై ప్రజలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినప్పటికీ.. ఎలాంటి ఫలితం దక్కడం లేదు. ఈ క్రమంలోనే ఒక వ్యక్తి తనదైన సలహా ఇచ్చారు. నీటి సమస్య ఎక్కువగా వుంటే.. మూడు పెళ్లిళ్లు చేసుకుంటే పరిష్కారం లభిస్తుందని ఆయన ఉచిత సలహా ఇచ్చారు.
మధ్యప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతానికి చెందిన ఓ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఈ విధంగా నీటి సమస్యపై సరికొత్త పరిష్కారం సూచించారు. ముగ్గురు మహిళలను పెళ్లి చేసుకోవాలని, వాళ్లలో ఒకళ్లు పిల్లలను కంటే, మిగిలిన ఇద్దరు నీళ్లు తెస్తారని జతారా ఎస్డీఎం బీకే పాండే ఉచిత సలహా ఇచ్చారు. ఒకనాడు తాను బైర్వార్ గ్రామం మీదుగా వెళుతున్నప్పుడు.. రాత్రి 2 గంటల సమయంలో కూడా కొందరు మహిళలు నీళ్లు తెచ్చుకోవడం చూశానని, అది చూసి తనకు చాలా బాధేసిందని ఆయన అన్నారు. అప్పుడు తనకు ఆ గ్రామంలో నీటి సమస్య ఏమేరకు వుందో తెలిసిందని.. మహిళలు ఇలా రాత్రివేళల్లో నీళ్లకోసం వెళితే అది చాలా పెద్ద సమస్యగా మారే అవకాశం వుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ సమస్యను అధిగమించాలంటే.. భరించగల సామర్థ్యం ఉన్నవాళ్లు మంచినీళ్లు కావాలనుకుంటే ముగ్గురిని పెళ్లి చేసుకోవాలని ఆయన చెప్పుకొచ్చారు. అయితే.. అంతగా డబ్బు లేనివాళ్లు మాత్రం మూడేసి పెళ్లిళ్లు చేసుకుంటే భరించడం కష్టం అవుతుందని తనదైన శైలిలో జాగ్రత్తలు కూడా చెప్పారు. మరి.. నీళ్లకోసం ఈయన ఇచ్చిన ఈ ‘మూడు పెళ్లిళ్ళ’ ఉచిత సలహా సమంజసమేనా? అని అంతా చెప్పుకుంటున్నారు.
ఇదిలావుండగా.. మధ్యప్రదేశ్లోని బందేల్ ఖండ్ ప్రాంతంలో నీటి సమస్య తీవ్రంగా వుంటూ వస్తోంది. బుందేల్ఖండ్ ప్యాకేజి కింద వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. గడిచిన నెలలో వీధిపంపు వద్ద జరిగిన ఘర్షణలో ఓ మహిళ మరణించింది. నీళ్లకోసం నిత్యం గొడవలు చోటు చేసుకుంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more