గత వారం రోజులుగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు గడ్డు కాలం నడుస్తోంది. ఓటుకు నోటుకు వ్యవహారంలో చంద్రబాబు వాయిస్ తో విడుదలైన ఆడియో టేపులు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. అయితే రేవంత్ రెడ్డి దగ్గరి నుండి కీలక సమాచారం సేకరించి, చంద్రబాబు మీద కేసుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం. అయితే ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్టు చేస్తారంటూ అప్పుడే పుకార్లు వస్తుండటంతో తెలుగుదేశం వర్గాల్లో కలకలం రేగింది. అయితే నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి వెళుతున్నారు. అక్కడ కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ తో పాటు మరికొంత మంది మంత్రులతో సమావేశమవుతారని తెలుస్తోంది. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై చంద్రబాబు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారని తెలుస్తోంది.
చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కేంద్ర టెలికాం మంత్రి విచారణ జరిపించాలని కోరారు. అలా కేంద్రం స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలను సెటిల్ చెయ్యాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మరికొందరు మంత్రుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నట్లు ఇప్పటికే ఏపి ఇంటలిజెన్స్ ఆధారాలు కూడా సేకరించిందని సమాచారం. ఆ సాక్షాలతో కేంద్రానికి ఫిర్యాదు చెయ్యడంతో పాటు.. తెలంగాణ ప్రభుత్వం చేసిన నిర్వాకాన్ని వెలుగులోకి తేవాలని చంద్రబాబు తనదైన స్టైల్ లో మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. మొత్తానికి చంద్రబాబు కేంద్రంలో రింగ్ తిప్పుతారో లేదా కేసీఆర్ చేత బోనులోకి తోయబడతారో చూడాలి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more