నారా చంద్రబాబు నాయుడుతో సహా చాలా మంది ఏపి మంత్రులు, అధికారుల ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని ఏపి ప్రభుత్వం గట్టిగా వాదిస్తోంది. ఓటుకు నోటు వ్యవహారంతో బయటకు వచ్చిన చంద్రబాబు ఆడియో టేపులతో ట్యాపింగ్ దుమారం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. అయితే ఫోన్ల ట్యాపింగ్ వార్తలు నిజమేనని, వెంటనే ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కూడా ఏపి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే ఏపి క్యాబినెట్ తమ భవిష్యత్ ప్రణాళికలపై మూడు ఆప్షన్స్ ఉన్నాయి. అవి..1. ట్యాపింగ్పై ఏపీ సర్కారు నేరుగా టి- సర్కారుపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకోవడం. 2. కేంద్రానికి ఫిర్యాదు చేసి, కేంద్రం ద్వారా విచారణ చేయించడం. 3. ఇది రెండు రాషా్ట్రల మధ్య వివాదం కావడంతో నేరుగా సుప్రీం కోర్టులో ఫిర్యాదు దాఖలు చేయడం.
అయితే ఏపి ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చెయ్యడం ద్వారా మొత్తం గుట్టురట్టవుతుందని ఆలోచిస్తున్నట్లు సమాచారం. కాగా కొంత మంది మాత్రం తెలంగాణ ప్రభుత్వంపై కేసు ఫైల్ చేసి గట్టిగా దర్యాప్తు చేస్తే బాగుంటుందని కూడా సూచించినట్లు సమాచారం. మరో పక్క ఫోన్ ట్యాపింగ్ పై ఏపి ఇంటలిజెన్స్ పక్కా ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో ఏపీకి చెందిన 120 మంది నేతల ఫోన్లను టి-పోలీస్ అధికారులు ట్యాప్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ ఐజీ అనూరాధ చెప్పినట్లు తెలిసింది. టెలికం కంపెనీల అనుమతితో సంబంధం లేకుండా, నేరుగా ఫోన్లలో సంభాషణలు వినే ఆధునిక యంత్ర పరికరాలను కూడా తెలంగాణ పోలీసులు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. అలాంటి యంత్రాలకు అనుమతి లేనప్పటికీ వాటిని వినియోగిస్తున్నారని ఇంటెలిజెన్స్ ఐజీ అనూరాధవివరించారు. కేంద్రం నేరుగా దర్యాప్తు చేపడితే ఇవన్నీ వెలుగులోకి వస్తాయని, టెలికం కంపెనీలూ కేంద్రం అడిగితే పూర్తి వివరాలు ఇస్తాయని చెప్పారు.మరి ఏపి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more