ఉత్తర్ ప్రధేశ్ లోని ఓ అండర్ ట్రయల్ ఖైదీ వద్ద రాజ్ పథ్, రాష్ట్రపతి భవన్ కు చెందిన మ్యాప్ లు కలిగివున్న ఘటన కలకలం రేపుతోంది. ఖైదీని క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులకు వాటితో పాటు భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో ఎక్కడెక్కడ బిఎస్ఎఫ్ పోస్టులు వున్నాయన్న స్కెచ్ లు కూడా లభించడంతో అధికారులు విస్తుపోయారు. అండర్ ట్రయల్ ఖైదీ వద్ద ఈ మ్యాఫ్ లను కనుగోన్న అధికారులు అతడి నేర చరిత్రపై ఆరా తీసేందుకు ఖైదీ సొంత రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ కు పోలీసుల బృందాన్ని పంపారు.
ఈ నెల 7వ తేదీన సాధారణ తనిఖీలలో భాగంగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని జైళ్లన్నింటిలో సంబంధిత అధికారులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా హత్యా నేరం కేసులో అభియోగాలను ఎదుర్కోంటూ మోరాదాబాద్ జైలులో వున్న సాధిక్ అలి అనే పాతికేళ్ల అండర్ ట్రయల్ ఖైదీ వద్ద నుంచి రాజ్ పథ్, రాష్టపతి భవన్ కు సంబంధించిన మ్యాప్ లు, భారత్, బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఏయే ప్రాంతాల్లో వున్న బిఎస్ఎఫ్ చెక్ పోస్టులు వున్నయన్న విషయాన్ని స్పష్టం చేసే స్కెచ్ లు లభించడంతో జైలు అధికారులు షాక్ తిన్నారు. జైలులో అండర్ ట్రయల్ ఖైదీగా వున్న సాధిక్ వద్దకు అవి ఎలా వచ్చాయన్న అంశమై ఆరా తీస్తున్నారు.
దేశానికి సంబంధించిన అత్యంత రహస్య సమాచారం అండర్ ట్రయల్ ఖైదీ వద్ద లభించడంతో ఖంగుతిన్న పోలీసులు.. ఖైదీ సోంత రాష్ట్రానికి పోలీసులు బృందాన్ని పంపి కూపీ తీస్తున్నారు. నిందితుడికి ఉగ్రవాదులకు ఏమైనా సంబంధాలు వున్నాయా అన్న కోణంలో దర్యాప్తును ప్రారంభించారు. నిందితుడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సాంబాల్ జిల్లాకు చెందిన వాడని గుర్తించిన పోలీసులు.. 2011లో తన సన్నిహితుడు ఇమ్రాన్ తో గోడవలో అతన్ని హతమార్చినట్లు అభియోగాలపై జైలుకు వచ్చాడు. దీంతో ఖైదీ వద్ద లభించిన ఇతర హిందీ, మంధారిన్, బెంగాళీ బాషల్లోని పలు రచనలను, రెండు సెల్ ఫోన్ లను, రెండు మెమరీ కార్డలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more