పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఇక మీదట మరింత క్రియాశీలం కానుంది. అందులో భాగంగానే జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ నినాదాలు చేశారు. చాలా కాలం తర్వాత జనసేన జెండా మళ్లీ జనాల ముందుకు వచ్చింది. అయితే ఇదంతా ఎంతో ప్లాన్డ్ గా సాగుతోందని సమాచారం. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడును కావాలనే గెరావ్ చేశారని సమాచారం. ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ ను ఆకాశానికి ఎత్తేశారు వెంకయ్య నాయుడు. అలాంటి వెంకయ్య నాయుడుకే జనసేన ఝలక్ ఇచ్చింది. ఏపికి ప్రత్యేక హోదా కల్పించడం వెనుక జరుగుతున్న జాప్యంపై జనసేన కార్యకర్తలు వెంకయ్య నాయుడును నిలదీశారు. రాజీనామా చెయ్యాలని వెంకయ్య నాయుడును డిమాండ్ చేశారు.
అయితే ఏపి రాజధాని కోసం రైతుల నుండి బలవంతంగా భూములు తీసుకోవడానికి వీలులేదంటూ పవన్ కళ్యాణ్ రాజధాని గ్రామాల్లో పర్యటించి ఝలక్ ఇచ్చేశారు. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ తన ప్రతాపాన్ని చూపించేందుకు సిద్దమవుతున్నారని సమాచారం. అందులో భాగంగానే జనసేన కార్యకర్తలు ఫస్ట్ లుక్ లా ధర్నా నిర్వహించారని సమాచారం. ఇక ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలని పవన్ కళ్యాణ్ రంగంలోకి దూకుతారని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీని త్వరలోనే కలిసి ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలని, ఇక్కడి పరిస్థితులను కూడా పవన్ వివరించనున్నారట. గత కొంత కాలంగా చంద్రబాబు నాయుడు ఏపికి నిధులను తీసుకురావడంలోనే బిజీగా ఉన్నారని కానీ ఎంతో అవసరమైన ప్రత్యేక హోదా మీద మాత్రం పెద్దగా వర్కవుట్ చెయ్యడం లేదని తెలుస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ ఏపికి ప్రత్యేక హోదా కల్పిస్తు కేంద్రం నుండి స్టేట్ మెంట్ విడుదల అయ్యేలా చూడాలని భావిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి మరోసారి పవన్ సారి విజృంభిస్తే చాలా మంది గుండెల్లో గంఠా భజాయిస్తుంది అని అప్పుడే సెటైర్లు కూడా వేసుకుంటున్నారట.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more