బ్రతుకుదెరువు కోసం ఎన్నో కష్టాలు అనుభవిస్తున్న మహిళలపై కొందరు వ్యక్తులు కన్నేసి వారితో అడ్డదారులు తొక్కిస్తుంటారు. డబ్బును క్యాచ్ చేసుకోవడం కోసం వారి బలహీనతను గుర్తించి.. తమ మాయమాటల్లో వారిని పడేసి వ్యభిచారం కూపిలోకి లాగుతుంటారు. ఈ విధంగా ఓ యువతి డబ్బులకు ఆశపడి సినీఇండస్ట్రీలో నటిగా కొనసాగుతున్న తన స్నేహితురాలిని వ్యభిచారం కూపిలో లాగింది. అయితే.. ఈ సమాచారం పోలీసులకు తెలియడంతో సదరు నటి వ్యభిచారం కూపి నుంచి విముక్తి పొందింది.
వివరాల్లోకి వెళ్తే.. తెలుగు, హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఓ నటికి ఇటీవలే సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఆఫర్లకోసం ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో రానురాను ఆమెకు జీవనం కొనసాగించడం కష్టతరంగా మారింది. ఈ విధంగా ఆ నటి కష్టాల్లో మునిగిపోగా.. దాన్ని అవకాశం తీసుకుని ఆమెను వ్యభిచారం కూపంలోకి దింపేందుకు సాక్షాత్తు ఆమె సహాయకురాలు ఆయేషా సయ్యద్ (30) ప్రయత్నించింది. ఇందుకు ఆమె ఓ పథకం కూడా రచించింది.
ఈ క్రమంలోనే నటి, ఆమె సహాయకురాలు ఇద్దరూ మంగళవారం ఉదయం పణజికి చేరుకుని ఓ ఫైవ్స్టార్ హోటల్లో రూమ్ తీసుకున్నారు. రాత్రయిన తర్వాత ఆ గదికి ఓ బడాబాబు చేరుకున్నాడు. అంతలోనే సమాచారం తెలుసుకున్న పోలీసులు హోటల్ పై దాడి చేశారు. పోలీసులు వచ్చిన విషయాన్ని పసిగట్టిన విటుడు.. తెలివిగా వారి కన్నుగప్పి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే.. అక్కడే వున్న నటిని, ఆమె సహాయకురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలా ఇద్దరినీ అదుపులోకి తీసుకుని వారిని విచారించగా.. నిస్సహాయ స్థితిలో ఉన్న తనను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపేందుకు ఆయేషా ప్రయత్నిస్తోందని నటీమణి పోలీసులకు తెలిపింది.
ఆ నటి వాంగ్మూలం తీసుకుని అనంతరం ఆమెను ప్రభుత్వ పునరావాస కేంద్రానికి తరలించామని.. ఆయేషాపై కేసు నమోదుచేసి, విటుడి కోసం గాలిస్తున్నామని పణజి ఇన్స్పెక్టర్ సిద్దాంత్ శిరోద్కర్ తెలిపారు. కాగా వ్యభిచారం చేయడానికి వెళ్లిన విటులపై కూడా 370ఏ కేసు పెట్టవచ్చని హైకోర్టు ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నేరం రుజువైతే విటుడికి ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more