స్టాక్ మార్కెట్ల ఇవాళ నష్టాల సునామీని ఎదుర్కోన్నాయి. నష్టాల సునామీ ధాటికి విలవిలలాడిన దేశీయ సూచీలు తీవ్రంగా కుదేలయ్యాయి. అసలే నూతన ఆర్థిక సంవత్సరం నుంచి ఒడిదోడుకుల మధ్య కోట్టమిట్టాడుతున్న మార్కెట్లను ఇవాళ రెండు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్షతో భారీ నష్టాల బాట పట్టిన స్టాక్మార్కెట్లు.. వానకు గాలి తోడవితే.. పెను బీభత్సంగా మారుతుందన్న చందగా, అర్బీఐ దెబ్బతో అతలాకుతమైన స్టాక్ మార్కెట్లపై.. భారత వాతావరణశాఖ ఐఎండీ ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులపై జారీ చేసిన అంచనాలతో మరింత కిందకు దిగజారాయి.
భారతీయ రిజర్వు బ్యాంకు ద్రవ్య పరిమితి విధానంపై సమీక్షించనుందన్న సమాచారంతో.. ఉదయం ప్రారంభం కాగానే మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్ 100 పాయింట్లు నష్టంతో. నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో కోనసాగాయి. ఆర్బీఐ ద్రవ్య పరిమితి విధాన సమీక్షలో రెపో రేటు, రివర్స్ రెపో రేటును తగ్గించి, గృహ, వాహన రుణదాతలకు శుభవార్తనందించిన నేపథ్యంలో.. పారిశ్రామిక రంగానికి మేలు చేసేలా నిర్ణయాలు లేకపోవడంతో.. బ్యాంకింగ్ రంగ సూచీలు కుదేలయ్యాయి. మదుపరుల అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు పతనం దిశగానే పయనించాయి.
అతే సమయంలో భారత వాతవావరణ శాఖ ఐఎండీ కూడా ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు అంత మెరుగ్గా వుండబోమని అంచనా వేసిన వివరాలను వెలువరించింది. రుతుపవనాల ఆలస్యంతో వర్షాభావ, కరవు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందంది. ఈ సారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. వర్షపాతం 93 నుంచి 88శాతానికి తగ్గుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఐఎండీ అంచనాల ప్రభావం కూడా స్టాక్మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది
దీంతో మధ్యహ్నం వరకు 400 పాయింట్ల నష్టంతో కొనసాగిన మార్కెట్లు.. సాయంత్రం ముగిసే సమయానికి భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 661 పాయింట్ల నష్టంతో 27 వేల 188 పాయింట్ల వద్ద ముగియగా, అటు నిఫ్టీ కూడా 197 పాయింట్ల నష్టంతో 8236 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించింది. ఈ క్రమంలో జీ ఎంటర్ టైన్ మెంట్, లుపిన్, భారతీ ఎయిర్ లెట్ సంస్థల షేర్లు మినహా ఇతర సంస్థల షేర్లేవీ కూడా లాభాల భాటలో పయనించలేదు. కాగా, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐటీసీ, హిండాల్కో, ఏషియన్ పెయింట్స్, యస్ బ్యాంక్, తదితర సంస్థల షేర్లు నస్టాలను చవిచూశాయి. మరోవైపు ఫోరెక్స్ మార్కెట్ లో రూపాయి కూడా పతనం చెందింది. డాలర్ తో రూపాయి మారకం విలువ దిగజారింది. సోమవారం 63.73 వద్ద ముగిసిన రూపాయి.. ఇవాళ 18 నుంచి 19 పైసల మేర నష్టపోయింది. ఇవాళ 63.90 పైసల వద్ద ముగిసింది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more