బాలీవుడ్ బిగ్ బి, సూపర్ స్టార్ ప్రపంచ వ్యాప్తంగా అశేష జనాధరణ కలిగిన ప్రముఖ సినీనటుడు అయనే అమితాబ్ బచ్చన్. ఆయన నిత్యం తన సినిమా లోకంలోనే విహరిస్తుంటారు. ఎప్పటికప్పుడు ట్రెండ్ ను ఫాలో అవుతూ అభిమానులతో సోషల్ మీడియా అనుసంధానంగా కలుస్తుంటారు. తనకు సంభించిందిన తాజావార్తలు, విశేషాలను వారితో పంచుకుని సంబరపడిపోతుంటారు. ఏడు పదుల వయస్సు దాటిని ఇంకా నిత్యనూతన విద్యార్థి మాదరిగానే ఆయన వ్యవహరిస్తుంటారు. అదే ఆయన గోప్పదనం. అమితాబచ్చన్ కోసం ఇంతగా ఉపోద్ఘాతం అవసరం లేదు. ఎందుకంటే అయన దేశప్రజలందరికీ సుపరిచితులే కాబట్టి.
అయితే.. ఎందుకో గత కోంత కాలంగా ఆయన దేశంలోని పరిస్థులను గమనిస్తున్నట్లు వున్నారు. పలువురి ద్వారా విషయాలను కూడా తెలుసుకుంటున్నట్లు వున్నారు. ఆయన సతీమణి జయాబచ్చన్ రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న కారణం చేతనో.. లేక మరే కారణం చేతనో.. దేశంలో అన్నదాతల పరిస్థితులపై ఆయన స్పందించారు. దేశంలో ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని అమితాబ్ బచ్చన్ అన్నారు. కాగా, అంతకన్నా దారుణం విషయమేమిటంటే.. చేతిలో రూ. 20 వేలు, రూ. 30 వేలు లేకపోవడంతో.. రైతులు బలవంతంగా ఉసురు తీసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
యావత్ దేశానికి అన్నం పెడుతున్న రైతన్న మరీ దర్భర జీవితాలను గడపలేక, తన కుటుంభ సభ్యులకు అన్నం పెట్టలేక.. తనకు తానే విషం తీసుకుని అమరుడవుతన్నాడని.. ఇదే పరిస్థితి మరికోన్నాళ్ల పాటు కోనసాగితే.. రైతు అనేవాడే దేశంలో కనబడరని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల గురించి పట్టించుకోకపోతే మొత్తం సమాజమే ముప్పులో పడిపోతుందని హచ్చరించారు. రైతన్నలను కాపాడాల్సిన బాధ్యత యావత్ దేశ ప్రజలందరిపైనా ఉందన్నారు. ముఖ్యంగా రాజకీయ నేతలు రైతుల సమస్యలను తెలుసుకుని, వారికి సహకరించేందుకు ప్రయత్నించాలన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సైతం రైతులకు తొలి ప్రాధాన్యతను ఇవ్వాలని అమితాబ్ కోరారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more