ఎమ్మెల్యే కోటాలో జరుగనున్నఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది. ఓపెన్ బ్యాలెట్ విధానాన్ని నిర్వహించాలని సీఈసీ నిర్ణయం తీసుకోవడంతో టీఆర్ఎస్ డైలామాలో పడింది. ఐదుగురు అభ్యర్థులను ఎమ్మెల్సీ ఎన్నికల పోరుకు టీఆర్ఎస్ సిద్ధం చేసిన నేపథ్యంలో ఓపెన్ బ్యాలెట్ ఎన్నిక విధానం చేటు తెచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులను సొంత పార్టీ బలంతోనే గెలిచే అవకాశం ఉన్న టీఆర్ఎస్.. ఐదో అభ్యర్థికి మాత్రం కచ్చితంగా వేరే పార్టీల మద్దతు తీసుకోవాలి. ఆ క్రమంలోనే సీక్రెట్ బ్యాలెట్ విధానమైతే బాగుంటుందని టీఆర్ఎస్ భావించింది.
తెలంగాణ శాసన మండలి ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అప్రజాస్వామిక విధానానికి పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద్భాస్కర్.. న్యూఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)ను కలసి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రత్యక్ష పద్దతిలో నిర్వహించాలని ఆయన ఎన్నికల కమీషన్ ను కోరారు. రాపోలు పిర్యాదును పరిగణలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ఓపెన్ బ్యాటెల్ విధానం ద్వారనే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం టీఆర్ఎస్ పార్టీలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఓపెన్ బ్యాలెట్ విధానంలో ఎమ్మెల్సీలకు వేసే ఓటు బహిర్గతం కానుండటంతో ఎమ్మెల్యేలు ఎటువంటి రిస్క్ తీసుకునే ఆస్కారం ఉండదు. ఒకవేళ పార్టీ నిర్ణయాన్ని ఉల్లంఘించి ఓటేయాలనుకుంటే ఎమ్మెల్యే పదవి కోల్పోయే ప్రమాదం పోంచి ఉంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more