విమర్శలకు, వ్యక్తిగత దూషణలకు దూరంగా వుంటే కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి జైపాల్రెడ్డి ప్రధాని నరేంద్రమోడీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మోదీకి జ్ఞానం తక్కువ....అహంకారం ఎక్కువ అని ఆయన దుయ్యబట్టారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ బీహార్లో తక్షశిల, నలంద ఉందన్న మోదీకి చరిత్రే కాదు జాగ్రఫీ కూడా తెలియదని ఎద్దేవా చేశారు. ఐఐటీ గురించి పరిజ్ఞానం లేని మోదీకి ప్రవాసభారతీయులు స్వాగతం చెబుతున్నారన్నారు. బీజేపీలో సీనియర్ నాయకులను పక్కన బెట్టిన మోడీ.. అసలు బీజేపి అంటే తానేనన్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాశ్మీర్ టెర్రరిస్టుల సాయంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీకి దేశ భక్తి ఎంత ఉందో దీని ద్వారా అర్థమవుతుందన్నారు. పాకిస్థాన్ విషయంలో మోదీ ఎన్నికల ముందు ప్రదర్శించిన దేశభక్తి ఇప్పుడు చూపడంలేదని జైపాల్రెడ్డి విమర్శించారు.
ప్రధానమంత్రి రేసులో వున్న బీజేపి అగ్రజుడు ఆద్వానీని మమ్మీగా, సుష్మాను డమ్మీగా మార్చారని విమర్శించారు. సుష్మాస్వరాజ్ను మోదీ రాజకీయంగా దేశబహిష్కరణ చేశారని జైపాల్ వ్యాఖ్యానించారు. అసాధ్యమైన హామీలు ఇవ్వడంలో మోదీ, కేసీఆర్ ఒక్కటే అని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో మోదీ అసాధ్యమైన వాగ్దానాలు చేసి... అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయారని జైపాల్ రెడ్డి విమర్శించారు. భూసేకరణ బిల్లును కేసీఆర్ ఎందుకు సమర్థిస్తున్నారని ఆయన నిలదీశారు. భూసేకరణబిల్లుపై కోర్టులో మోదీకి ఓటమి తప్పదని జైపాల్రెడ్డి పేర్కొన్నారు. మొదటి నుంచి కేసీఆర్ మోదీతో కలవడానికి అసక్తి చూపారని ఆయన పేర్కోన్నారు. అబ్బదాలు చెప్పడంలో కేసీఆర్ మోడీని మించిపోతున్నారని జైపాల్ రెడ్డి విమర్శించారు
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more