నరేంద్రమోడీ.. ఒకప్పుడు సీదాసాదా రాజకీయ నాయకుడు! అయితే.. అంతలోనే ఈయన కెరీర్ మలుపు తిరిగింది. అప్పటివరకు గుజరాత్ సీఎంగా కొనసాగిన కేషుభాయ్ పటేల్ పాలనపై ఎన్నో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. ఆయన స్థానంలో మోడీని సీఎంగా పార్టీ ఎన్నుకొంది. అంతే! ఇక అక్కడి నుంచి తన రాజకీయ ప్రతాపాన్ని ప్రదర్శిస్తూ ముందుకు దూసుకెళ్లారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే దేశంలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ సీఎంగా ఎదిగారు. రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో ఎలా నడిపించాలోనన్న విషయాన్ని తన పాలన ద్వారా తెలియపరిచారు. దాంతో ఈయన మూడుసార్లు సీఎంగా ఎన్నికయ్యి రికార్డు నెలకొల్పారు.
అభివృద్ధి అన్న పదానికి మారుపేరుగా నిలిచిన మోడీ.. దేశానికి ప్రధాని అయితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని భావించారు. ఈ మేరకు దేశప్రజలు మోడీకి మద్దతు పలుకుతూ ‘అబ్ కీ బార్ మోడీ సర్కార్’ అని నినాదాలు చేశారు. దీంతో బీజేపీ పార్టీ మోడీనే ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకొంది. అంతే! చరిత్ర తిరగరాసే విధంగా బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ సీట్లతో గెలుపొందింది. కాంగ్రెస్ చరిత్రను పూర్తిగా తుడిచేసే విధంగా ఘనవిజయం సాధించింది. ఒక రాష్ట్ర సీఎం నుంచి ప్రధానిగా ఎదిగిపోయారు మోడీ! ఇప్పటికి ఈయన ప్రధానిగా పాలన చేపట్టి ఏడాది పూర్తయ్యింది. ఈ క్రమంలో ఆయన దేశప్రజలకు ఓ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన కొన్ని అరుదైన అంశాలను పొందుపరిచారు. ‘నా ప్రియమైన దేశ ప్రజలారా’ అంటూ ప్రారంభమైన ఆ లేఖలో.. తాను తన పరిపాలన కాలంలో చేపట్టిన పథకాలను, చేసిన పనులు, ఇతర ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆ లేఖలో ఆయన ఏం వెల్లడించారంటే..
కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో తనకు పేదలు గుర్తుకొస్తారని.. అందువల్లే తాను వారి కోసం జన్ ధన్, అటల్ పెన్షన్, ప్రధానమంత్రి జీవనజ్యోతి పథకాలను ప్రవేశపెట్టినట్లుగా మోడీ తెలిపారు. తమ ప్రభుత్వం రైతుల పరిహారాన్ని ఒకటిన్నర రెట్లు పెంచిందని.. అతివృష్టి, అనావృష్టి వల్ల ఇబ్బందులు పడుతున్న అన్నదాతకు ఎల్లప్పులూ సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. బొగ్గుగనుల వేలం ద్వారా రూ.3 లక్షల కోట్లు, రేడియో తరంగాల వేలం ద్వారా రూ.1 లక్ష కోట్లను ఖజానాకు చేర్చిన ఘనత ఎన్డీయే ప్రభుత్వానిదేనని అన్నారు. ‘మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియా’ వంటి పకాల ద్వారా యువతకు మరింత మెరుగైన ఉపాధి అవకాశాలను దగ్గర చేశామని మోడీ పేర్కొన్నారు. ముద్రా బ్యాంకు ఏర్పాటుతో చిన్న, మధ్యతరహా కంపెనీలకు రూ.10 లక్షల వరకూ బ్యాంకు రుణాలను దగ్గర చేశామని ఆయన వివరించారు. విదేశాల్లో నల్లధనం దాచుకున్న వారిని చట్టం ముందు నిలిపేందుకు చర్యలు చేపట్టామని అన్నారు.
ఈ క్రమంలో ‘స్వచ్ఛభారత్’ ముఖ్య ఉద్దేశం గురించి ప్రస్తావిస్తూ.. ఆ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది ఆడపిల్లలు బహిర్భూమికి వెళ్లకుండా చూడటమేనని అన్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు లేని కారణంగా అమ్మాయిలు చదువు మానుకునే పరిస్థితి రాకూడదని ఆయన చెప్పారు. అందుకే.. ‘ఆడపిల్లలను రక్షించండి.. చదివించండి’ అనే నినాదంతో ముందుకు సాగుతున్నామన్నారు. ప్రతి గ్రామాన్ని ‘డిజిటల్ కనెక్టివిటీ’లో భాగం చేస్తామని అన్నారు. ప్రపంచదేశాలతో పోటీగా దేశం ముందుకెళ్లడానికి సిద్ధంగా వుందని చెప్పిన ఆయన.. ప్రజలు కలిసి రావాలని కోరారు. ఈ విధంగా తన ప్రసంగంతో ప్రజలకు ఉత్తేజపరిచిన ప్రధాని మోడీ.. ‘మీ సేవకే అంకితం.. జైహింద్’ అంటూ ముగించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more