టైటిల్ చూడగానే పాపం ఆయనకు నిజంగా తలనొప్పిగా ఉందేమో..? జండూ బామ్ ఇద్దాం అనుకుంటున్నారేమో..? అలా అనుకుంటే మాత్రం తప్పు తప్పు. అసలు విషయం ఏంటీ అంటే తెలుగుదేశం పార్టీ నుండి టిఆర్ఎస్ పార్టీకి మారిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ను టిడిపి నాయకులు మాత్రం వదలడం లేదు. తమ పార్టీ టికెట్టు మీద గెలిచి టిఆర్ఎస్ పార్టీ నుండి మంత్రి పవది పొందడంతో టిడిపి నాయకులు మండిపడుతున్నారు. అందుకే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టిడిపి వాళ్లు కేసీఆర్ ప్రభుత్వాన్ని, మండలి చైర్మెన్ ను నిలదీసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. తాజాగా తలసాని శ్రీనివాస్ తో పాటు మరో ఇద్దరిపై టిడిపి వారు న్యాయపోరాటానికి సిద్దమవుతున్నారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తెలంగాణ టీడీపీ న్యాయపోరాటానికి దిగింది. ఎమెల్మీ ఎన్నికల నేపథ్యంలో తలసాని, తీగల కృష్ణారెడ్డి, చల్లాధర్మారెడ్డిలను ఓటింగ్కు అనర్హులుగా ప్రకటించాలని హైకోర్టులో సోమవారం హౌస్మోషన్ పిటిషన్ను దాఖలు చేసింది. తలసానితో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించడమే ఫిరాయింపునకు సాక్ష్యమని కోర్టుకు టీడీపీ వివరించింది. నాలుగు నెలల క్రితమే వీరిని అనర్హులుగా ప్రకటించాలని టీడీపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ పిటిషన్ను సింగిల్ బెంచ్లో కొట్టివేయగా, డివిజనల్ బెంచ్ను ఆశ్రయించింది. దీంతో పిటిషన్ను స్వీకరించిన హైకోర్టు పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన అందరికీ నోటీసులు జారీ చేసింది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి కథలికలు లేకపోవడం ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తుండటంతో టీడీపీ వేగంగా పావులు కదుపుతోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ముగ్గిరిని ఓటుకు దూరంగా ఉంచాలనే ఆలోచనతో అన్ని అవకాశాలను టీడీపీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే వారికి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆ ముగ్గురిని ఓటింగ్కు అనర్హులుగా ప్రకటించాలని హౌస్మోషన్లో కోరినట్లు తెలుస్తోంది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more