ఓయు విద్యార్థులు మరోసారి సమర శంకాన్ని పూరించారు. ఇన్నాళ్లు ఉద్యమం అంటే తెలంగాణ కోసం అన్నట్లు సాగిన ఓయు విద్యార్థులు ఇప్పుడు ఇక తెలంగాణ సర్కార్ కు వ్యతిరేకంగా తమ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఓయు భూముల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తామని.. ఖచ్చితంగా కట్టించి తీరతామని ఖరాఖండిగా వెల్లడించారు తెలంగా ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పుడు ఓయు విద్యార్థులు తమ పోరాటాన్ని తీవ్రం చేశారు. ఓయు పరిధిలోని భూముల్లో అక్రమ నిర్మాణం చేశారంటూ తార్నాకలోని స్వాగత్ గ్రాండ్ హోటల్ పై దాడికి పాల్పడ్డారు. విద్యార్థులు ఒక్కసారిగా హోటల్ వైపుకు దూసుకునావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు అక్కడి చేరుకొని విద్యార్థులను అక్కడి నుండి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఓయు భూముల జోలికి వస్తే ఊరుకోబోము అంటూ విద్యార్థులు కేసీఆర్ ను హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం కావాలనే ఓయు భూముల మీద రాద్దాంతం చేస్తోంది అంటూ వాళ్లు మండిపడుతున్నారు. తెలంగాణ ప్రభత్వం కావాలనే ఓయు భూములను స్వాధీనం చేసుకోవడానికి ఇలా డ్రామాలాడుతోందని వారు మండిపడుతున్నారు. ఓయు భూముల కబ్జా పై ఇప్పటికే చాలా ఫిర్యాదులు వెళ్లాయి. కాంగ్రెస్ నాయకులు గవర్నర్ కు, విద్యార్థులు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఓయు భూముల్లోనే ఇళ్లు నిర్మిస్తామని అంటున్నారు. అయితే విద్యార్థులకు బాసటగా కొన్ని పార్టీ ఇప్పటికే తమ మద్దతు ప్రకటించాయి. అలాగే కోదండరామ్ లాంటి మేధావులు కూడా తెలంగాణ సర్కార్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. మరి తెలంగాణ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more