ఏఫి మండలి బరిలోనిలిచేందుకు అన్ని పార్టీలు అభ్యర్థులను వెల్లడించాయి. ఇక ఎలాగైనాసరే పదవులను పొందాలని ఆశిస్తున్న వారి పైరవీలకు అంతేలేదు. అన్ని పార్టీలు దాదాపుగా పార్టీల అభ్యర్థులను ఖరారు చేశాయి. ఏపి టిడిపి తరఫున ఎమ్మెల్సీ బరిలో దిగనున్న అభ్యర్థులు..ఎమ్మెల్యే కోటా కింద భర్తీ చేయాల్సిన రెండు సీట్లకు ఎంఏ షరీఫ్ (పశ్చిమ గోదావరి), జూపూడి ప్రభాకరరావు (ప్రకాశం), గవర్నర్ కోటా కింద నాలుగు సీట్లకు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి(నెల్లూరు), పంచుమర్తి అనురాధ(విజయవాడ), టీడీ జనార్థనరావు(కృష్ణా), గౌనివారి శ్రీనివాసులు(చిత్తూరు) ఎంపికయ్యారు.
ఇటు తెలంగాణలోనూ ఎమ్మెల్సీల హడావిడి కొనసాగుతోంది. అధికార టీఆర్ఎస్లో మండలి అభ్యర్థులు ఎవరో దాదదాపుగా తెలిసినపోయింది. అధికారికంగా ఇంకా ప్రకటించకున్నా, ఎమ్మెల్సీలుగా పోటీ పడనున్న వారి పేర్లు బయటకు వచ్చాయి. ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్రావు ఈ పేర్లను అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు బుధవారం ఆరుగురు నేతలు నామినేషన్ పత్రాలను భర్తీ చేశారు. గురువారం వీరంతా వాటిని దాఖలు చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీలు కె.యాదవరెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకుడు, పార్టీ కార్యాలయ కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీనివాస్రెడ్డి బుధవారం నామినేషన్ పత్రాలు భర్తీ చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని బట్టి నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను తేలిగ్గా గెలుచుకుంటుంది. కాంగ్రెస్కు ఒక స్థానంలో విజయం సాధించేందుకు వీలుగా ఎమ్మెల్యేల సంఖ్య ఉంది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more