తెలంగాణ రాష్ట్రంలో అదనంగా వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలు పార్టీలోని లుకలుకలను బయటపెట్టాయి. గతంలో అమాత్యులుగా ప్రజల ఆదరాబిమానాలు పోందిన నేతలు.. ఇప్పడు తమను పలకరించే వారు లేక.. ఏ పదవి వచ్చినా తమకే కావాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన ఒక్కగానోక్క ఎమ్మెల్సీ సీటుకు తమ పేరును ఖరారు చేయాల్సిందింగా.. ఎవరికి వారు అధిష్టానం వద్ద లాభియింగ్ కు పాల్పడ్డారు. పదేళ్ల పాటు కోనసాగిన అధికారం ఒక్కసారిగా పోవడంతో.. అందివచ్చిన అవకాశ్ని అందిపుచ్చుకునేందుకు పదుల సంఖ్యలోనే నేతలు ప్రయత్నాలు చేశారు. అయితే ఎట్టకేలకు ఎమ్మెల్సీ స్థానానికి ఆకులు లలిత పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేయడంతో.. పార్టీలో లుకలుకలు భయటపడ్డాయి.
ఎమ్మెల్సీ తన కన్నా సినియర్లు రాష్ట్ర మాజీ పిసీసీ ఇంచార్జ్ డి.శ్రీనివాస్ లేదా మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డిలకు రిక్త హస్తం అందించడంతో హైదరాబాద్ నగర కాంగ్రెస్ ఇంచార్జ్ దానం నాగేందర్ పార్టీకి రాజీనామా చేసినట్లు సమాచారం. అయితే తన రాజీనామాకు గల కారణాలను వివరిస్తూ దానం.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ పంపించినట్లు తెలిసింది. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సబితా ఇంద్రారెడ్డి లేదా డి.శ్రీనివాస్ లకు ఎమ్మెల్సీ సీటు ఎందుకివ్వలేదని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం.
హైదరాబాద్ నుంచి తన పేరును ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి పరిశీలించాల్సిందా కూడా కోరానని అయినా అదిష్టానం తనకు కూడా రిక్తహస్తం అందించిందని ఆయన ఆవేదన వెలిబుచ్చినట్లు సమాచారం. మహిళలకే ఎమ్మెల్సీ స్థానాన్ని ఇవ్వాలని అనుకున్న పక్షంలో కాంగ్రెస్ అధిష్టానం సబితా ఇంద్రారెడ్డిని ఎందుకు పక్కనపెట్టిందని ఆయన నిలదీసారు. సీనియర్లు ముందు గుర్తుంపు ఇచ్చి.. జూనియర్లకు తరువాత అవకాశం ఇవ్వాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారని సమాచారం. అకుల లలిత తరువాత వచ్చే అవకాశాలలో స్థానం ఇచ్చి వుండాల్సిందని దానం అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఇక గ్రేటర్ లో కాంగ్రెస్ అభ్యర్థులను ఎవరు గెలిపిస్తారో వేచి చూడాలని ఆయన అధిష్టానానికి సవాల్ విసిరినట్లు తెలుస్తోంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more