భారత్, పాకిస్థాన్ అనే రెండు దేశాల మధ్య పరిస్థితి ఎలా ఉంటుంది అని ఎవరిని అడిగినా.. ప్రపంచంలోని ఏ వ్యక్తైనా చెప్పే సమాధానం ఒక్కటే. పక్క గడ్డి వేసినా భగ్గు మంటుంది అని. మామూలుగా రెండు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అంటేనే అదేదో పెద్ద యుద్దానికి సిద్దపడట్లు రెండు దేశాలకు చెందిన వారు సిద్దమవుతారు. మ్యాచ్ చివరి క్షణం వరకు తమ దేశమే గెలవాలని కోరుకుంటారు. గెలిచిన దేశం చేసే హడావిడి అంతా ఇంతా కాదు. అయితే రెండు దేశాలు విడిపోయిన దగ్గని నుండి పాకిస్థాన్ భారత్ పైకి యుద్దానికి ప్రతీసారి కాలు దువ్వుతూ ఉంటుంది. బోర్డర్ దాటి ఎప్పుడూ ఉగ్రవాదులు కాల్పులకు తెగపడుతునూ ఉంటారు. అయితే భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన కార్గిల్ యుద్దం రెండు దేశాల చరిత్రల్లో నిలిచిపోయింది. అయితే తాజాగా నాటి కార్గిల్ యుద్దం గురించి మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ చేసిన వ్యాక్యలు మరోసారి వివాదానికి తెర తీవాయి.
బారత్ తో 1999 కార్గిల్ యుద్దానికి పాకిస్థాన్ సిద్దపడింది. కార్గిల్ భూభాగాన్ని ఆక్రమించుకొని పాక్ జెండాను ఎగరవేసింది. అయితే ఎంతో కష్టపడి భారత సైనికులు పోరాడి భారత భూభాగాలను కైవసం చేసుకుంది భారత్. అయితే నాటి కార్గిల్ యుద్దంలో భారత్ కు ముచ్చుమటలు పట్టించమంటూ పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తెలిపారు. కార్గిల్ ప్రాంతానికి చేరుకున్నామని, ఆ సమయంలో భారత్ కుత్తుక పట్టుకున్నామని పొగరుబోతు మాటలు.. మదమెక్కిన మాటలు మాట్లాడారు ముషారఫ్. భారత్ పై మేము విజయం సాధించాం అంటూ చరిత్రను మరోసారి గుర్తు చేసే ప్రయత్నం చేశారు పర్వేజ్. అయితే భారత్ కాస్త ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే కానీ యావత్ భారత్ ఒక్కతాటిపై నిల్చిన విదానాన్ని మాత్రం ముషారఫ్ మరిచిపోయాడు అంటూ కొంత మంది విమర్శలు గుప్పిస్తున్నారు. అయినా ఆడలేక మద్దెలు బాగొలేవు అన్న చందాన.. అంతా ముగిసి, యుద్దం అయిపోయిన తర్వాత ఏం మాట్లాడితే మాత్రం ప్రయోజనం.
*అబినవయారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more