సాధారణంగా హోటల్ లో టిఫిన్ చేస్తున్నప్పుడు చెట్నీ అయిపోతే ఇంకా కావాలని అడగడం సహజం! అందుకు అనుగుణంగానే హోటల్ యజమానులు కూడా స్పందించి చెట్నీ, ఇతర కర్రీలు వేస్తారు. ఇది ప్రతిఒక్క హోటల్, టిఫిన్ సెంటర్లలో సహజంగా జరిగేవే! కానీ.. ఓ యువకుడు తనకు చెట్నీ కావాలని హోటల్ యజమానిని అడిగినందుకు అతగాడు ఆగ్రహించి ‘పచ్చడి’ కింద కొట్టేశాడు. ఎంతో దారుణంగా కొట్టాడంటే.. దెబ్బలు తిన్న ఆ యువకుడు ప్రస్తుతం ఆసుపత్రి ఐసీయూలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన తూర్పు న్యూఢిల్లీలోని త్రిలోక్ పూరి బ్లాక్ 31లో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. సన్నీ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి రోడ్డు పక్కనే వున్న కాకా హోటల్లో టిఫిన్ తింటున్నారు. ఆ క్రమంలో సన్నీ ప్లేట్లో పచ్చడి అయిపోయింది. మళ్లీ పచ్చడి కావాలని హోటల్ యజమాని కమల్ని కోరాడు. అంతే! కమల్ కి కోపం కట్టలు తెంచుకుంది. అక్కడే వున్న రాడ్ తీసుకుని సన్నీపై ఒక్కసారిగా దాడి చేశాడు. విచక్షణరహితంగా కొట్టి ‘పచ్చడి’ చేసేశాడు. దాంతో సన్నీ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఇక అక్కడే వున్న అతడి స్నేహితులు ఈ ఘటనను చూసి భయాభ్రాంతులకు గురయ్యారు. ఏం చేయాలో తోచక వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కమల్పై కేసు నమోదు చేశారు. మరోవైపు సన్నీని చికిత్స నిమిత్తం లాల్ బహదూర్ శాస్త్రీ ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలైన నేపథ్యంలో మెరుగైన వైద్య చికిత్స కోసం అతడిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ఇదిలావుండగా.. సన్నీని దారుణంగా కొట్టిన కమల్ వాదన మరోరకంగా వుంది. సన్నీ చెట్నీని ఎక్కువ వృద్ధా చేశాడని, అలా చేయవద్దని చెప్పినందుకు అతడితోపాటు అతడి స్నేహితులు తనతో ఘర్షణకు దిగారని కమల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా అతడి స్నేహితులకు ఫోన్ చేస్తే.. వారు కూడా వచ్చి తనతో వాదనకు దిగారని ఆ ఫిర్యాదులో అతడు పేర్కొన్నాడు. దీంతో అతని ఫిర్యాదు మేరకు సన్నీపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more