venkaiah naidu slams rahul gandhi and congress party leaders

Venkaiah naidu takes on rahul gandhi and congress party leaders

venkaiah naidu takes on rahul gandhi, congress party leaders, Venkaiah naidu, central minister, rahul gandhi, kisan sandesh yatra,

venkaiah naidu takes on rahul gandhi and congress party leaders alleges kisan sandesh yatra as a part of power politics

అధికారం కోసమే రాహుల్ పాదయాత్రలు...

Posted: 05/15/2015 03:58 PM IST
Venkaiah naidu takes on rahul gandhi and congress party leaders

ఎవరె ఎన్ని పాదయాత్రలు చేసినా.. భూ సేకరణ చట్టంలో సవరణలపై కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గేది లేదని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారిన మండిపడ్డారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతులను పరామర్శించేందుకు తెలంగాణలో పర్యటించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షడు రాహుల్ గాంధీ పాదయాత్రపై ఆయన విరుచుకుపడ్డారు. శుక్రవారం గుంటూరు జిల్లా నరసరావుపేటలో బీజేపీ కార్యకర్తలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... అధికారం లేదనే కాంగ్రెస్ నేతలు పాదయాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పార్టీ హయాంలో దేశవ్యాప్తంగా 2 లక్షలమందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన గుర్తు చేశారు. అప్పుడు రాహుల్ గాంధీ ఎమ్మయ్యారని, ఆయనకు అప్పుడెందుకు పాదయాత్రలు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. రాహుల్ ఇప్పుడెందుకు పాదయాత్రలు చేస్తున్నారని వెంకయ్య నిలదీశారు. బ్రీటీష్ కాలం నాటి భూసేకరణ చట్టం కింద లక్షల ఎకరాలు సేకరించిన కాంగ్రెస్.. ఇప్పుడు ఈ భూసేకరణ చట్టానికి ఎందుకు అడ్డుపడుతోందని ప్రశ్నించారు. అభివృద్ది కుంటుపడకుండా చాడాలన్న లక్ష్యంతోనే తాము భూ సేకరణ చట్టానికి సవరణ చేస్తున్నామని చెప్పారు. బడా వ్యాపార వేత్తలకు అనుకూలంగా పనిచేసింది యూపీఏ ప్రభుత్వమే అని వెంకయ్య మండిపడ్డారు. మోడీ సూటు వేసుకున్నారని కాంగ్రెస్ నేతలు అరోపిస్తున్నారని.. అప్పట్లో గాంధీ, నెహ్రూలు కూడా సూటు బూటు వేసుకున్నారన్న సంగతి మర్చిపోవద్దని సూచించారు.
.
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venkaiah naidu  central minister  rahul gandhi  kisan sandesh yatra  

Other Articles