ఎవరె ఎన్ని పాదయాత్రలు చేసినా.. భూ సేకరణ చట్టంలో సవరణలపై కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గేది లేదని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారిన మండిపడ్డారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతులను పరామర్శించేందుకు తెలంగాణలో పర్యటించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షడు రాహుల్ గాంధీ పాదయాత్రపై ఆయన విరుచుకుపడ్డారు. శుక్రవారం గుంటూరు జిల్లా నరసరావుపేటలో బీజేపీ కార్యకర్తలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... అధికారం లేదనే కాంగ్రెస్ నేతలు పాదయాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీ హయాంలో దేశవ్యాప్తంగా 2 లక్షలమందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన గుర్తు చేశారు. అప్పుడు రాహుల్ గాంధీ ఎమ్మయ్యారని, ఆయనకు అప్పుడెందుకు పాదయాత్రలు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. రాహుల్ ఇప్పుడెందుకు పాదయాత్రలు చేస్తున్నారని వెంకయ్య నిలదీశారు. బ్రీటీష్ కాలం నాటి భూసేకరణ చట్టం కింద లక్షల ఎకరాలు సేకరించిన కాంగ్రెస్.. ఇప్పుడు ఈ భూసేకరణ చట్టానికి ఎందుకు అడ్డుపడుతోందని ప్రశ్నించారు. అభివృద్ది కుంటుపడకుండా చాడాలన్న లక్ష్యంతోనే తాము భూ సేకరణ చట్టానికి సవరణ చేస్తున్నామని చెప్పారు. బడా వ్యాపార వేత్తలకు అనుకూలంగా పనిచేసింది యూపీఏ ప్రభుత్వమే అని వెంకయ్య మండిపడ్డారు. మోడీ సూటు వేసుకున్నారని కాంగ్రెస్ నేతలు అరోపిస్తున్నారని.. అప్పట్లో గాంధీ, నెహ్రూలు కూడా సూటు బూటు వేసుకున్నారన్న సంగతి మర్చిపోవద్దని సూచించారు.
.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more