పాకిస్థాన్ నగరం కరాచీలో తాలిబన్ ఉగ్రవాదులు ఒక్కసారిగా ఓ బస్సుపై మూకుమ్మడి దాడిచేసి 47 మందిని పొట్టనబెట్టుకున్న సంఘటన మరువకముందే ఆప్ఘన్ లో మరో దారుణంగా చోటు చేసుకుంది. ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లోని ఓ హోటల్లో సాయుధులు తెగబడ్డారు. విదేశీయుల అతిథి గృహమైన ఆ హోటల్లోకి ఉగ్రవాదులు చొరబడి విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ సంఘటనలో ఇద్దరు భారతీయులు సహా మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయారు.
‘పార్క్ ప్యాలెస్ హోటల్’ అనే భవనాన్ని ఆ ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకొని దాడికి పాల్పడ్డారు. ఈ హోటల్లో సాయుధుల చెరలో చాలామంది ఉన్నారు. వీరిలో ఎక్కువమంది భారతీయులు, ఇతర దేశీయులే ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది. మరోవైపు ఈ ఘటన చోటుచేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అందరి క్షేమం ఆకాంక్షించారు. సాయుధుల చెరలో వున్నవారికి ఎలాంటి హాని జరగకుండా సురక్షితంగా బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం మోడీ చైనా పర్యటనలో బిజీగా వున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more