తమిళనాడులో రాజకీయ సమీకరణలు మారుతున్నాయా.. జయలలితకు అనుకూలంగా కోర్టు తీర్పు వెల్లడించగానే ప్రధాని నరేంద్ర మోదీ జయలలితకు గ్రీటింగ్స్ చెప్పడం కొత్త పొత్తుకు తెర తీస్తోందా అన్న అనుమానాలే కలిగిస్తోంది. తమిళనాడులో శరవేగంగా మారుతున్న రాజకీయ పరి ణామాల నేపధ్యంలో కొత్త సమీకరణాలు చోటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సతమతమైన జయలలితకు కర్ణాటక హైకోర్టు నుంచి ఊరట లభించడంతో ఆ రాష్ట్ర రాజకీయాలు చకచకా మారుతున్నాయి. తమిళనాడులో తమ ఉనికిని చాటుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్న బీజేపీకి...ఈ సందర్భం కలిసొచ్చిన అవకాశంగా పరిశీలకులు భావిస్తున్నారు.
వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జయలలిత పోటీకి అనర్హురాలైతే...ఏఐఏడీఎంకేకి సమర్ధవంతమైన సారధ్యం కరువవుతుందేమోననే భయం, బెంగా ఆ పార్టీ శ్రేణుల్లో ఉంది. కర్ణాటక హైకోర్టు తీర్పుతో...జయలలిత మళ్లిd చురుగ్గా రాజకీయాల్లో పాల్గొనే అవకాశం అందిపుచ్చుకోవడంతో పార్టీ ఆనందోత్సాహాల్తో తలమునకలవుతోంది. సరిగ్గా ఇప్పు డే... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా తమిళనా డులో ఉనికిని చాటుకునేందుకు ఏఐఏడీఎంకేతో సాన్నిహి త్యాన్ని కోరుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అదే సమ యంలో రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖపాత్ర నిర్వర్తిస్తున్న ఏఐఏడీఎంకేకి కూడా కేంద్రంలో పట్టు సాధించుకునేందుకు గాను బీజేపీతో మైత్రీ బంధం అత్యవసరం. అందువల్ల మారుతున్న రాజకీయపరిస్థితుల్లో బీజేపీ, ఏఐఏడీఏంకేలు చెట్టాపట్టాలేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ముందు ముందు ఏం జరుగుతుందో.. బయటికి వచ్చిన తర్వాత జయలలిత ఏదైనా ప్రకటన చేస్తుందో లేదో చూడాలి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more