కాంగ్రెస్ నేతృత్వంలోని గత యుపిఎ ప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని హడావుడిగా ఆమోదించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుతం ఎన్డిఎ ప్రభుత్వం తీసుకువచ్చిన భూసేకరణ బిల్లుపై పార్లమెంట్లో వివాదం కొనసాగుతున్న తరుణంలో ఆయన ఈ విమర్శ చేశారు. అప్పట్లో భూసేకరణ చట్టానికి మద్దతు తెలిపి బిజెపి కూడా తప్పు చేసిందని మోదీ అంగీకరించారు. భూసేకరణ చట్టానికి సంబంధించిన చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 120 ఏళ్ల తర్వాత గుర్తుకు వచ్చిన ఈ బిల్లును పరిశీలించేందుకు గత యుపిఎ ప్రభుత్వం కనీసం 120 గంటల సమయాన్ని కూడా వెచ్చించలేదు. అందుకు కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే బాధ్యురాలు కాదు. అప్పట్లో ఈ బిల్లుకు మద్దతు తెలిపి బిజెపి కూడా తప్పు చేసింది అని మోదీ పేర్కొన్నారు.
ఎన్నికలు సమీపిస్తుండటం, పార్లమెంట్ సమావేశాలను ముగించాల్సి ఉండటంతో భూసేకరణ చట్టాన్ని ఆమోదించాలని కాంగ్రెస్ నేతృత్వంలోని గత యుపిఎ ప్రభుత్వం హడావుడిగా నిర్ణయం తీసుకుందని, ఈ చట్టం పెద్ద సమస్యగా పరిణమించినట్లు అన్ని రాష్ట్రాలు ఆ తర్వాతే గుర్తించాయని మోదీ అన్నారు. కేంద్రంలో తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ బిల్లును సవరించాల్సిన అవసరం ఉందని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తనకు తెలియజేశారని, ఇందుకు సంబంధించి వారు రాసిన లేఖలు కూడా తనవద్ద ఉన్నాయని, లేకపోతే తాము ఈ చట్టం జోలికి వెళ్లి ఉండేవారం కాదని దైనిక్ జాగరణ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ స్పష్టం చేశారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more