అవును.. ఆయనెంతో మంది సినిమా వాళ్లకు కొత్త లైఫ్ ఇచ్చారు కానీ ఇప్పుడు మాత్రం తాను బలైపోయానని అంటున్నారు. దాసరి నారాయణరావు పుట్టిన రోజు సందర్భంగా జరిగిన వేడుకలో చేసిన వ్యాఖ్యలు తన పేరు బొగ్గు కుంభకోణంలో ఉండటాన్ని పరోక్షంగా ఖండించారు. అంతేనా కావాలనే తనను ఇరికించారన్నట్లు మాట్లాడారు. బొగ్గు కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కుంటున్న దాసరి నారాయణ రావు తన నిజాయితీ గురించి చెప్పుకొచ్చారు. తాను ని.జాయితీపరుడినని అంటూ.. ఎవరినో కాపాడుకునేందుకు తనను బలి చేశారని దాసరి వివరించారు. తనపై పడ్డ మచ్చను తొలగించుకుంటానని కూడా దాసరి వివరించారు. అయితే ఇప్పటికే సిబిఐ ఎక్వైరీ ఎదుర్కొని.. కోర్టుల చుట్టు చక్కర్లు కొడుతున్నారు పాపం దాసరి నారాయణ రావు. కుంభకోణానికి సంబంధించి అప్పట్లో బొగ్గు శాఖ మాజీ సహాయ మంత్రి దాసరి నారాయణరావుపై సీబీఐ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. కోల్గేట్ స్కామ్లో ఈ నెల 22న దాసరి కోర్టుకు హాజరు కానున్నారు. బొగ్గు గనుల కేటాయింపులో భారీ స్థాయిలో కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.
బొగ్గు కుంభకోణంలో టాలీవుడ్ దర్శకుడు దాసరి నారాయణ రావును సీబీఐ విచారించింది. దాసరి నారాయణ రావు యూపీఏ-1 ప్రభుత్వంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఈ యూపీఏ-1 ప్రభుత్వంలోనే బొగ్గు స్కామ్ జరిగినట్టు సీవీసీ నివేదిక బట్టబయలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశం మేరకు దర్యాప్తు చేసిన సీబీఐ కూడా భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్టు తేల్చింది. 1.68 లక్షల కోట్ల బొగ్గు కుంభకోణంలో దాసరి పాత్ర ఏంటి? అక్రమంగా కేటాయించిన గనుల్లో ఈయన పాత్ర ఏంటి తదితర అంశాలపై సీబీఐ విచారించింది. మరి దాసరి నారాయణ రావు మాత్రం తనపై పడిన మచ్చను తొలగించుకుంటానని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more