తెలంగాణ సచివాలయంపై గత కొంత కాలంగా రగడ నడుస్తోంది. ఉన్న సెకరటేరియట్ స్థానంలో కొత్తది కట్టాలని ముందు అనుకున్నా.. తర్వాత మాత్రం ఎర్రగడ్డలోని ఛాతి ఆస్పత్రి వద్దగా కొత్తగా నిర్మించాలని తెలంగాణ సర్కార్ ఆలోచించింది. అయితే అక్కడ నిర్మాణానానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని అక్కడి కాకుండా వేరే చోట కట్టాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం.. తర్వాత సచివాలయాన్ని సికింద్రాబాద్ లోని బైసన్ గ్రౌండ్ లో నిర్మించాలని ప్రతిపాదనలు సిద్దం చేసింది. అయితే అది రక్షణశాఖ ఆధీనంలో ఉన్న స్థలం కాబట్టి రక్షణ మంత్రిత్వ శాఖ పర్మిషన్ కావాలి. అందుకే ఢిల్లీ టూర్ లో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సచివాలయానికి రూట్ క్లీయర్ చేసుకొని వచ్చారు.
తెలంగాణ సచివాలయం నిర్మించేందుకు వీలుగా సికింద్రాబాద్లోని 60 ఎకరాల బైసన్ గ్రౌండ్స్ స్థలాన్ని ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు రక్షణ మంత్రి మనోహర్ పారికర్ను కోరారు. దాదాపు తెలంగాణ ప్రతిపాదనకు ఒప్సుకున్న రక్షణ మంత్రి.. 60 ఎకరాల స్థలాన్ని తమకు వేరే చోట కల్పించాలని కేసీఆర్ తో అన్నారు. దాంతో కొత్తగా బైసన్ గ్రౌండ్ లోని 60 ఎకరాల స్థలంలో కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వానికి అన్ని రకాలుగా లైన్ క్లీయర్ అయింది. అయితే రక్షణ శాఖ నుండి ల్యాండ్ స్టేట్ గవర్నమెంట్ కు బదిలీ కావడానికి కాస్త టైం పడుతుంది. అయితే అంతలోపు తెలంగాణ ప్రభుత్వం కూడా రక్షణ శాఖకు 60 ఎకరాల స్థలాన్ని కేటాయించాల్సి ఉంటుంది. మొత్తానికి ఎక్కడెక్కడో అనుకున్న సెక్రటేరియట్ ఇప్పుడిక సికింద్రాబాద్ బైసన్ గ్రౌండ్ లో ఖరారైంది. మరి తెలంగాణ ప్రభుత్వం టకటకా అనుమతులు పొంది.. నిర్మాణాన్ని ప్రారంభించడమే తరువాయి..
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more