ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సినీ నటుడు శివాజీ ఆదివారం గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట అమరణ దీక్ష చేపట్టారు. చిత్ర పరిశ్రమ పెద్దలు, పవన్ కల్యాణ్ లాంటి నాయకులు పెద్ద మనసుతో తన ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. తన దీక్ష స్వార్థం కోసం చేస్తున్నది కాదని, తన ప్రాంతం, తన రాష్ట్రం, తన తెలుగు ప్రజలు, తనను ఇంతవాణ్ణి చేసిన ఈ రాష్ర్టానికి అన్యాయం జరుగుతుంటే చూడలేక ఒక సామాన్య మానవుడిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దీక్ష ప్రారంభించినట్లు చెప్పారు. తన దీక్ష పార్టీలకు సంబంధం లేదని, వ్యక్తిగతంగా చేస్తున్నటువంటి ఉద్యమం అని శివాజీ తెలిపారు.
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందన్నారు. ప్రత్యేక హోదాపై ఎందుకు ముందడుగు పడటం లేదో పవన్ కళ్యాణ్ కేంద్రాన్ని అడగాలని కోరారు. పవన్ కల్పించుకుంటే బీజేపీ దిగొస్తుందన్నారు. తనకు ఎవరు మద్దతు పలకకపోయినప్పటికీ, ఎవరంతట వారు హోదా కోసం పోరాడాలన్నారు. తన దీక్ష శాంతిమార్గంలో సాగుతుందని చెప్పారు.
కాగా, ప్రత్యేక హోదా కోసం దీక్ష చేస్తున్న నటుడు శివాజీకీ మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి షాకిచ్చారు. శివాజీ బీజేపీ సభ్యుడు కాదని తెలిపారు. నటుడు శివాజీకి బీజేపీలో సభ్యత్వం లేదని చెప్పారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి ఈ విషయాన్ని ఇదివరకే ప్రకటించారని పురందేశ్వరి పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, పోలవరం నిర్మాణానికి కేంద్రం 90 శాతం నిధులు ఇస్తోందని చెప్పారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more