హైకోర్టును విభజించాలని గత కొంత కాలం నుండి నడుస్తున్న వివాదానికి ఉమ్మడి హైకోర్ట్ బ్రేక్ వేసింది. తెలంగాణ ప్రభుత్వానికి ఝలక్ కూడా ఇచ్చింది. ఉమ్మడి హైకోర్టును ఇప్పట్లో విభజించేందుకు వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త భవనం నిర్మించిన తర్వాత మాత్రమే హైకోర్టును విభజించాలని తేల్చిచెప్పింది. ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసుకునే అధికారం తెలంగాణ రాష్ట్రానికి లేదని హైకోర్టు స్పష్టం చెయ్యడంతో తెలంగాణకు చెందిన న్యాయవాదులు ఖంగుతిన్నారు. అవసరమైతే ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిన తర్వాత బెంచీలు పెట్టుకోవచ్చని, అంతే తప్ప ఇప్పటికిప్పుడు కోర్టును విభజించడం మాత్రం కుదరదని హైకోర్టు చెప్పింది. ప్రత్యేక హైకోర్టు కోసం తెలంగాణ ప్రభుత్వం గచ్చిబౌలి ప్రాంతంలో ఒక భవనాన్ని కూడా కేటాయించింది. కానీ అలా ప్రత్యేకంగా కోర్టు ఏర్పాటుచేసుకునే హక్కు తెలంగాణకు లేదని కోర్టు స్పష్టం చేసింది. దాంతో తెలంగాణ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
ఏపీ హైకోర్టు నిర్మాణానికి నిధులను కేంద్రమే భరించాలని కూడా హైకోర్టు తెలిపింది. తెలంగాణ భూభాగంలో ఆంధ్రప్రదేశ్కు హైకోర్టును నిర్మించడం సరికాదని స్పష్టం చేసింది. ఉమ్మడి హైకోర్టును రెండుగా విభజించాలని.. ఏపీ, తెలంగాణకు రెండు హైకోర్టులు ఉండాల్సిందేనని తెలంగాణ న్యాయవాదులు ఎప్పటి నుంచో ఆదోళన చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం రాక ముందు నుంచే దీని కోసం ఉద్యమాలు జరిగాయి. ఇక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో ఆందోళనలు చేశారు. ఎట్టకేలకు ఇప్పుడు హైకోర్టు విభజనపై తుది తీర్పు వెల్లడైంది. అయితే రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్ట్ లు ఉండాల్సిందేనని గత కొంత కాలంగా తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. కానీ ఏపిలొ ప్రత్యేక హైకోర్ట్ ఏర్పడే వరకు ఇప్పుడున్న హైకోర్ట్ రెండు రాష్ట్రాలకు చెందుతుందని స్పష్టం చేసింది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more