పంజాబ్ రాష్ట్రంలోని అమ్మాయిని లైంగికంగా వేధించి.. బస్సులోంచి తోసేసి.. ఆమె మరణానికి కారణమైన ఘటనలో వినియోగించిన కంపెనీ బస్సు తమదేనని పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ అంగీకరించారు. ఆ బస్సు తమ కుటుంబ కంపెనీకి చెందినదేనన్నారు. అయినా సరే, బస్సులో ఓ మైనర్ బాలికపై పాశవికంగా అత్యాచార యత్నానికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. తాను ఇప్పటి వరకు ఈ కంపెనీకి వెళ్లలేదని చెప్పారు. ఈ బస్సు వ్యవహారం గురించి తాను సుఖ్ బీర్ సింగ్ తో మాట్లాడతానని చెప్పారు. కాగా ఈ ఘటనపై కాంగ్రెస్ వర్గాలు మోగాలో నిరసన ప్రదర్శన చేశాయి. తక్షణం ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి.
కాగా, ఈ ఘటనపై స్పందించిన పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సతీమణి, కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దారుణాలను ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరముందని అన్నారు. నిందితులకు తప్పక ఖటినంగా శిక్ష్ పడుతుందని చెప్పారు. అయితే బస్సు ఎవరిది..? ఏ సంస్థకు చెందిందన్న విషయం మాత్రం పోలీసులు పరిశీలిస్తారని అన్నారు. కాగా పంజాబ్ పోలీసులు మరో అడుగు ముందుకేసి బస్సు యజమానులు ఎవరో తెలియదని, తమ స్వామి భక్తిని చాటుకున్నారు. బస్సు యజమానులకు కోసం పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇక మరోవైపు బస్సులో బాలికపై జరిగింది అత్యాచారం కాదని, హత్యగా పోలీసులు పేర్కోన్నారు.
14 ఏళ్ల వయసున్న బాలికను కొంతమంది ఈవ్ టీజర్లు కదులుతున్న బస్సులోంచి కిందకు తోసేశారు. తీవ్రగాయాలతో ఆమె మరణించగా, ఆమె తల్లి తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలైంది. మోగా జిల్లాలో తమ గ్రామం నుంచి గురుద్వారాకు వెళ్లేందుకు ఆ బాలిక, ఆమె తల్లి కలిసి ఓ ప్రైవేటు బస్సు ఎక్కారు. అక్కడ కొంతమంది వ్యక్తులు ఆమెను లైంగికంగా వేధించబోగా.. వాళ్లు అడ్డుకున్నారు. దాంతో వాళ్లామెను బస్సులోంచి కిందకు తోసేశారు. బస్సులో ఆ సమయానికి కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఆమెను వేధించినవాళ్లు బస్సు డ్రైవర్, కండక్టర్ల స్నేహితులని తెలుస్తోంది. ఈ కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more