ఓ వైపు భూకంపానికి జనాలు భయపడుతూ ఉంటే కొందరు మాత్రం భూకంపాన్ని తమాషా కింద వాడుకుంటున్నారు. అయితే తాజాగా మళ్లీ పెను భూకంపం రాబోతోంది అంటూ వాట్సాప్ లో మెసేజ్ లు వచ్చాయి. అయితే నిజానికి మళ్లీ భూకంపం వస్తున్నట్లు ఎలాంటి సమాచారం లేదు కానీ ఆటపట్టించడానికి ఏకంగా ఓ ఎమ్మెల్యేనే అలా మెసేజ్ లు పెట్టడం వార్తల్లో నిలిచింది.‘‘మళ్లీ పెను భూకంపం రాబోతోంది’’ అంటూ వాట్సప్ ద్వారా మెసేజ్లు పంపించడంతో బీహార్లోని నర్పత్గంజ్కు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదుచేసినట్లు పోలీసులు చెప్పారు. ఆర్జేడీ నేత దయానంద్ రాయ్ రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. శనివారం రాత్రి మళ్లీ పెను భూకంపం రాబోతోందని ఆయన మెసేజ్లు పంపడంతో ప్రజలు తీవ్రంగా భయాందోళనకు గురయ్యారని పోలీసులు చెప్పారు. దీంతో ఆయనపై సెక్షన్ 505 కింద కేసు నమోదు చేశామని చెప్పారు. కాగా, ఆ మెసేజ్లకు తన తండ్రికి సంబంధం లేదని.. వాటిని పంపింది తానేనని దయానంద్ కుమారుడు రాజేశ్ కుమార్ వెల్లడించారు. తనకు వచ్చిన ఓ మెసేజ్ను పూర్తిగా చదవకుండానే ఇతరులకు పంపానని.. అయితే.. వెంటనే పొరపాటును గ్రహించి క్షమాపణ కూడా చెప్పానని వివరించారు అయినా ఎమ్మెల్యేగా ఉంటున్న ప్రజాప్రతినిధి ఇలా వ్యవహరించడం ఏంటని అందరు అనుకుంటున్నారట.
పాట్నాలో భూకంపం వచ్చిందని అందరూ ఆరుబయటకు వస్తే.. కొందరు దొంగులు మాత్రం అదే అదునుగా తమ చేతివాటం చూపించారు. ఖరీదైన ఇళ్లల్లోని విలువైన సామాగ్రిని భూకంపం పుణ్యమా అని గుట్టుచప్పుడు కాకుండా తరలించేశారు. తీరా భూకంపం లేదు అని తెలుసుకొని ఇంట్లోకి వచ్చిన వారికి అక్కడి సీన్ అర్థమయ్యింది. అప్పటికే అక్కడి నుండి దొంగలు పారిపోయారు. ఇలా భూకంపాన్ని అడ్డంపెట్టుకొని కొంత మంది దొంగతనాలు చేస్తుంటే మరి కొందరు ఆటవిడుపుగా తీసుకుంటున్నారు. ఇళ్లకు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్ట కాల్చుకోవడానికి నిప్పు కావాలని అడిగినట్లు ఉందీ కొంతమంది వ్యవహారం.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more