తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ వైఖరిపై టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఇక్కడేం పని అని టీఆర్ఎస్ బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యకు చంద్రబాబు స్పందించారు. ఆ మాట అనడానికి కేసీఆర్ ఎవరు అని చంద్రబాబు ప్రశ్నించారు తెలంగాణతో తనది ముప్ఫై ఏళ్ల అనుబంధం అని, తెలంగాణలో అభివృద్ధికి పునాదులు వేసింది తానేనని వెల్లడించారు. తాను అధికారం నుండి దిగిపోయే సమయానికి రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉందని తెలిపారు తాను ఎన్నో కంపెనీలను తేవడం వల్ల హైదరాబాద్కు ఆదాయం పెరిగిందని, దేశంలో తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఉందంటే అదితన శ్రమ అని టిడిపి అధినేత స్పష్టం చేశారు.
అంతేకాపీ కేవలం ఆరు నెలల్లో కేసీఆర్ పాలన వల్ల తెలంగాణ మిగులు రాష్ట్రం కాలేదని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. చేతనైతే తన కంటే బాగా చేసి చూపించాలని చంద్రబాబు సవాల్ విసిరాడు. తనపై ఏడిస్తే ఉపయోగం లేదని హితవు పలికారు. భౌతికంగా విడిపోయింది నిజం. కానీ మానసికంగా తెలుగువారంతా ఒక్కటే. తెలుగు వారి కోసం తెలుగుదేశం పార్టీ అక్కడా ఉంటుంది...ఇక్కడా ఉంటుందని అన్నారు. గిల్లి కజ్జాలు పెట్టుకొంటూ రెండు రాష్ట్రాల మధ్య తగాదాలు రగిలించేలాటీఆర్ఎస్ ప్రభుత్వం వైఖరి ఉన్నదని, తాను మాత్రం వీలైనంతవరకూ తెలంగాణకు కూడా సహకరిస్తూ తన పని తాను చేసుకొంటూ పోతున్నానని ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more