ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)లో ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తయింది. మే 14 నుంచి రెండు రాష్ట్రాలకు సంబంధించిన పరిపాలనా కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఏపీకి సంబంధించి ఏపీఎస్ఆర్టీసీగా, తెలంగాణకు సంబంధించి తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టు కార్పోరేషన్ (టీఎస్ఆర్టీసీ)గా గుర్తించారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండి సాంబశివరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కేడర్కు చెందిన ఉద్యోగులను ఆ జిల్లాకే కేటాయించారు. ఎగ్జిక్యూటివ్ స్థాయి అధి కారుల్లో 6 మందిని ఏపీకి, నలుగురిని తెలంగాణకు కేటాయించారు. బస్సు భవన్ను రెండు బాగాలుగా విభజించారు. ఏ బ్లాక్ను ఆంధ్రప్రదేశ్కు, బీ బ్లాక్ను తెలంగాణకు కేటాయించారు. ఏపీఎస్ఆర్టీసిీ ఎండిగా సాంబశివరావు, తెలంగాణ ఆర్టీసీ ఎండీగా రమణారావును నియమించారు.
రాష్ట్ర విభజన జరిగిన 9 నెలల తర్వాత కూడా సంస్థను విభజిం చకపోవడంతో పెద్దఎత్తున విమర్శలు తలెత్తిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాలకు చెందిన కార్మిక సంఘాలు కూడా వెంటనే సంస్థను విభజిం చాలని ఇరు రాష్ట్రాల రవాణా శాఖల మంత్రులు, సంస్థ ఎండీకి వినతిపత్రాలు సమర్పించారు. తెలంగాణకు చెందిన సంఘాలైతే ఆందోళనలు కూడా చేశాయి. ఆలస్యంగానైనా సంస్థలో ఉద్యోగు ల విభజన ప్రక్రియ పూర్తి కావడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తంచేశారు. ఆస్తుల విభజనలో ఉద్యోగుల మధ్య విబేధాలు తలెత్తాయి. ఉమ్మడి రాష్ట్రంలోని ఆస్తులను రెండు రాష్ట్రాలకు పంచాలని ఏపీ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ సంఘాలు ససేమిరా అంటున్నాయి. మా రాష్ట్రానికి చెందిన ఆస్తులు ఏపీకి ఎలా కేటాయిస్తారని మండి పడుతున్నాయి. ఆస్తులు, అప్పులకు సంబంధించి ప్రత్యేకంగా షిలాబిడే కమిటీని వేసినందున కమిటీ ఇచ్చే నివేదిక మేరకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. వచ్చే రెండు, మూడు నెలల్లో వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more