కాంగ్రెస్ నాయకులు పేలని టపాసుల్లా మారారు. పాపం వాళ్లు ఏం మాట్లాడినా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కనీసం పట్టుకోవడం లేదు. తాజాగా కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క టిఆర్ఎస్ పై విమర్శల వర్షం గుప్పించారు. ఆచరణ సాధ్యంకాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి టీఆర్ఎస్ అధికారంలో వచ్చిందంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ సర్కార్ హైదరాబాద్ను అమ్మకానికి పెడుతోందని భట్టి విక్రమార్క మండిపడ్డారు. సెక్రటేరియట్ను కూడా ప్రైవేట్ సంస్థలకు ధారదత్తం చేసేందుకు సిద్ధమవుతోందని విమర్శించారు. హైదరాబాద్ సిటీ, ప్రభుత్వ సంస్థలను రక్షించుకునే ఎజెండాతో తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లాలని భట్టి సూచించారు. ఈ సమావేశంలో భట్టి విక్రమార్కతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ భేటీ అయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు, పార్టీ సభ్యత్వ నమోదుపై నేతలతో ఉత్తమ్, భట్టి, షబ్బీర్ అలీ సమావేశమైయ్యారు.
అధికారక టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు హిత బోధ చేశారు. 10 నెలల కేసీఆర్ సర్కార్ రాజకీయ వలసలను ప్రోత్సహించిందే కానీ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆయన విమర్శించారు. వ్యవసాయ సంక్షోభం తీవ్రస్థాయికి చేరినా ప్రభుత్వం నిర్లక్ష్యంగానే ఉందని ఉత్తమ్ మండిపడ్డారు. ఇదిలా ఉండగా, వికారుద్దీన్ ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరపకుండా ప్రభుత్వమే విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి రావాలని కూడా అన్నారు. మైనార్టీల భాష్యం చెప్పుకునే ఎంఐఎం కూడా ఈ అంశాన్ని ప్రశ్నించడం లేదని ఉత్తమ్ విమర్శించారు. పార్టీలో విభేదాలు పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చెయ్యడానికి కాంగ్రెస్ కార్యకర్తలు పాటుపడాలని ఉత్తమ్ కుమార్ సూచించారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Mar 02 | తెలంగాణ ఇంటి కోడలినంటూ అదే మెట్టినిల్లు లాజిక్ తో ఇక్కడి రాజకీయాల్లో కొత్త పార్టీతో రంగప్రవేశం చేయునున్న వైఎస్ షర్మిల ఇప్పటికే జిల్లాల ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహించి, సమాలోచనలు జరిపిన విషయం తెలిసిందే. ఇక... Read more
Mar 02 | ఎల్గార్ పరిషద్ కేసులో అరెస్టయిన విరసం నేత వరవరరావుకు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. మహారాష్ట్ర బెయిల్ ష్యూరిటీ విషయంలో ఆయన ఎదుర్కోంటున్న ఇబ్బందులను ఆయన తరపు సినియర్ న్యాయవాది ఆనంద్ గ్రోవర్ బాంబే... Read more
Mar 01 | తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారిన న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు, నాగమణి దారుణ హత్యకేసులో పోలీసుల చేతికి కీలక ఆధారాలు లభించాయి. హత్యకు నిందితులు ఉపయోగించిన రెండు కత్తులు సుందిళ్ల బ్యారేజ్లో దొరికాయి. బ్యారేజ్ 53,... Read more
Mar 01 | అత్యచార కేసుల్లో బాధితులను పెళ్లి చేసుకుంటామని హామీ ఇచ్చినా.. లేక మరో విధంగా రాజీ కుదుర్చుకున్నా కేసుల నుంచి మినహాయింపు మాత్రం లభించదని గతంలోనే చెప్పిన దేశసర్వన్నత న్యాయస్థానం ఇవాళ ఓ ప్రభుత్వం ఉద్యోగి... Read more
Mar 01 | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏప్రీల్ 6వ తేదీన ఎన్నికల జరగనున్న తమిళనాడులో ఇవాళ బిజీగా పర్యటించారు. ఇటీవల కేరళలోని కోల్లా జిల్లాలో మత్స్యకారులతో కలసి చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన రాహుల్.. వారితో... Read more