తెలుగు రాష్ట్రాల ఆర్టీసీల్లో సమ్మె సైరన్ మోగింది. బుధవారం కార్మిక శాఖతో జరిగిన చర్చలు విఫలం కావడంతో మే 6 నుంచి నిరవధికంగా సమ్మె చేయాలని ఏపీ, తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న 1.20 లక్షల మంది ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ఈ నెల 2న ఈయూ-టీఎంయూ నేతలు సమ్మె నోటీసిచ్చారు. దీనిపై రెండు సార్లు యాజమాన్యంతో, కార్మిక శాఖ అధికారులతో చర్చలు జరిగాయి. ఇవి విఫలం కావడంతో యూనియన్ నేతలు సమ్మె బాట పట్టారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం దిగొచ్చేంతవరకు సమ్మె కొనసాగిస్తామని ఈయూ-టీఎంయూ నేతలు కె.పద్మాకర్, అశ్వత్థామరెడ్డిలు మీడియాకు తెలిపారు.
ఆర్టీసీ కార్మికులకు 2013 ఏప్రిల్ 1 నుంచి వేతనాల సవరణ జరగాల్సి ఉందని వివరించారు. గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 2014 ఫిబ్రవరి 1 నుంచి 27 శాతం ఇంటీరియం రిలీఫ్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆర్టీసీ కార్మికుల ప్రయోజనాల కోసం చేపడుతున్న ఈ నిరవధిక సమ్మెకు ఆర్టీసీలోని అన్ని కార్మిక సంఘాలు మద్దతివ్వాలని ఈయూ, టీఎంయూ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 24 నుంచి అన్ని డిపోలు, వర్కు షాపుల వద్ద సమ్మె సన్నాహక యాత్రలు నిర్వహించి కార్మికులను సమ్మెకు సిద్ధం చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. ఆంధ్ర ఎన్ఎంయూ నేతలు ఎన్నికలు జరపాలన్న డిమాండ్ విరమించుకుని సమ్మెకు మద్దతు పలకాలని కోరారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more