TRS | Manchi reddy kishan reddy | TDP |chandrababu | Tour

Tdp mla manchireddy kishan reddy decided to join in the trs party on 24th april

TDP, TRS, manchi reddy kishanreddy, TRS plenary, Chandrababu. telangana

TDP MLA Manchireddy Kishan reddy decided to join in the TRS party on 24th april. chandrababu naidu tour in mahabubnagar on 23rd of april. TRS party president kcr invites manchi reddy kishan reddy and his followers in the trs party on 24th april.

టిఆర్ఎస్ కు 'మంచి'.. టిడిపికి చెడు

Posted: 04/22/2015 12:07 PM IST
Tdp mla manchireddy kishan reddy decided to join in the trs party on 24th april


టిటిడిపి నిజంగా చెడు జరుగుతోంది. గత కొంత కాలంగా పార్టీని దెబ్బతీస్తూ అధికార పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు టిడిపిని ఇరుకున పెట్టేస్తున్నాయి. దాంతో తెలుగుదేశం పార్టీ నుండి ముఖ్య నాయకులు అంతా టిఆర్ఎస్ పార్టీ వైపు పరుగులు పెడుతున్నారు. తాజాగా తెలంగాణలో పర్యటించనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆపార్టీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి షాక్ ఇచ్చారు.  రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే సైకిల్ దిగి కారెక్కేందుకు రెడీ అయ్యారు. టీడీపీ నేతల బుజ్జగింపు ప్రయత్నాలు చేసినా ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈఉదయం టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయ్యారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.  మంచిరెడ్డి కిషన్ రెడ్డి గురువారం అధికారికంగా టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. అయితే మంచి రెడ్డి కిషన్ రెడ్డి టిఆర్ఎస్ ప్లీనరీ సమావేశం సందర్భంగా  ఈ నెల 24వ తేది టిఆర్ఎస్ కండువా కప్పుకుంటారని ఖరారరైంది.

టిడిపి అధ్యక్షుడు, ఏపి సిఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ పర్యటనలో భాగంగా రేపు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. అయితే టిడిపి పార్టీకి చెందిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని పార్టీలోకి ఇదే సమయంలో తీసుకోవాలని టిఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి.  మంచిరెడ్డి కిషన్ రెడ్డి నిన్న ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులోని తన వ్యవసాయక్షేత్రంలో పార్టీ ముఖ్యనేతలు, సహచరులతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. టీఆర్‌ఎస్‌లో చేరేందుకు దారితీస్తున్న పరిణామాలను వివరించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికారపార్టీతో చేతులు కలిపితే మంచి భవిష్యత్తు ఉంటుందని మంచిరెడ్డి సమాలోచనలు చేశారు. మొత్తానికి టిడిపి నుండి టిఆర్ఎస్ లోకి మంచిరెడ్డి వలస టిడిపికి ఏ మాత్రం మంచి చెయ్యదు.. గ్రేటర్ ఎన్నికల సమయంలో మంచిరెడ్డి వంటి నేతల రాక టిఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా మంచి చేస్తుంది.

రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మంచిరెడ్డి కిషన్ రెడ్డితెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయ్యారు. ఈనెల 24న టీఆర్ఎస్లో చేరుతున్నట్లు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్లు ఆయన చెప్పారు. పార్టీ కార్యకర్తల అభిప్రాయాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంచిరెడ్డి పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ నిధులు ఇస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన చెప్పారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  TRS  manchi reddy kishanreddy  TRS plenary  Chandrababu. telangana  

Other Articles