TRS | Plenary | Hyderabad | Padmarao

Trs party leaders focus on party plenary in the hyderabad

TRS, plenary, hyderabad, padmarao, te;angana, firstplenary,

TRS party leaders focus on party plenary in the hyderabad. After famation of new state telangana, This is the first plenary for TRS party. So leaders and telangana ministers focus on plenary.

రంగు పడుద్ది అంటున్న టిఆర్ఎస్ నేతలు

Posted: 04/17/2015 04:48 PM IST
Trs party leaders focus on party plenary in the hyderabad

ఇదేంటి హోళీ ఎప్పడో అయిపోయింది కదా మళ్లీ ఇప్పుడు రంగు పడటం ఏంటి అనుకుంటున్నారా. రాజకీయ నాయకులు తలుచుకుంటే ఏమైనా జరగవచ్చు. మరి రంగులు పడటం పెద్ద లెక్కా. అయితే తాజాగా హైదరాబాద్ లో రంగు పడుద్ది అంటున్నారు ఓ పార్టీ నాయకులు. తమ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ మొత్తం రంగు పడుద్ది అంటున్నారు వారు. ఇంతకీ ఎవరా పార్టీ నేతలు అని ఆలోచిస్తున్నారా..ఇంకెవరు తెలంగాణలో అధికారాన్ిన నడుపుతున్న టిఆర్ఎస్ పార్టీ. పార్టీ ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్ లో రంగు వెయ్యడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ నెల 24న జరగనున్న టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు హైదరాబాద్ చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహిస్తామని  ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావు తెలిపారు. ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ప్లీనరీ సమావేశాలకు దాదాపు 40 వేల మంది హాజరవుతారని మంత్రి పద్మారావ్ వెల్లడించారు. ఈ ప్లీనరీలో పార్టీకి సంబంధించిన కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ను గులాబీరంగు మయం చేసి గ్రేటర్లో టీఆర్ఎస్ సత్తా చాటుతామని పద్మారావు స్పష్టం చేశారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  plenary  hyderabad  padmarao  te;angana  firstplenary  

Other Articles