మధ్యప్రదేశ్లో మరో ఘోరం జరిగింది. ఖాండ్వా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇరాక్ లో యాజిది అమ్మాయిలు అనుభవించిన ఘటనలను మన దేశంలో ప్రజా స్వామ్యంలో జరుగుతున్నా.. పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. నేరాలను ఎన్నికల ముందు ప్రచారాస్త్రాలుగా మలుచుకుని గెలుపోందేందుకు.. అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు మాత్రమే అలోచించే నాయకులు అధికారం చేపట్టాక.. ఎన్ని నేరాలు జరిగినా తమకు పట్టవన్నట్లుః కళ్లుమూసుకుంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీ మొదలుకుని.. మారు మూల పల్లెల వరకు అబలలపై అత్యాచారాలు జరుగుతూనే వున్నాయి. మహిళల దినోత్సవం రోజునో.. లేక వారి సాధికారత దినోత్సవం రోజునే మొసలి కన్నీరు కార్చే నేతలు.. నిజంగా అబలల పట్ల చిత్తశుద్దిగా తీసుకున్న చర్యలేమిటో చెప్పాలి.
ప్రత్యేక చట్టాలు తీసుకువచ్చినా.. ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసినా.. నానాటికీ అబలలపై జరుగుతున్న అత్చాచార ఘటనలు పెరుగుకు పోతున్నాయే తప్ప.. ఎక్కడా.. తగ్గడం లేదని గణంకాలు తెలిపాయి. తాజాగా, ఖండ్వా ప్రాంతానికి చెందిన ఇద్దరు అమ్మాయిలను 15 రోజుల క్రితం నిర్బంధించి పలు నగరాల్లో తిప్పుతూ గ్యాంగ్ రేప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం ప్రకారం ఇంట్లోంచి పారిపోయి, బస్సులో వస్తున్న ఇద్దరు అమ్మాయిలకు ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి వారిని హోషాన్బాద్కు తీసుకెళ్లాడు.
అక్కడి నుంచి భోపాల్, జబల్పూర్ రేవా లాంటి చోట్ల దాచిపెట్టి, తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేశారు. నాలుగు నగరాల్లో పదిహేను రోజులు ఇరవై మంది వ్యక్తులు నరకం చూపించారు. అయితే దుండగులు చివరిసారి నిర్బంధించిన ఇంటికి తాళం వేయడం మర్చిపోయిన సంగతిని గమనించిన అమ్మాయిలిద్దరూ అక్కడినుంచి తప్పించుకుని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్మాయిల సమాచారంతో జిల్లాలోని కొన్ని అనుమానిత ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. నిందితుల్లో ఒకడ్ని గుర్తించినట్టు సమాచారం. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ ఎంఎస్ సికార్వార్ తెలిపారు. అనుమానిత ప్రదేశాలకు పోలీసు టీంలను పంపించామని.. తొందర్లోనే నిందితులను పట్టుకుంటామన్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more