ఇదేంటి ఏదో తెలుగు సినిమాలో లిరిక్ అనుకుంటున్నారా.. అలాంటిదే కానీ మ్యాటర్ మాత్రం చాలా సీరియస్. అసలు విషయం ఏమిటంటే ఈ మధ్య గాలిలో ఎగిరే విమానాలు నేల మీదకు ల్యాండ్ అయ్యేటప్పుడు పుసుక్కున జారిపోతేన్నాయి. అయితే మామూలుగా జారిపోతే పర్లేదు ఏకంగా రన్ వేను వదిలి చాలా దూరం వరకు జారి పోతేన్నాయి. ఇలా జారుతున్న విమానాలు కొన్ని సార్లు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఆ మధ్య విమానం రన్ వే నుంచి జారిపోయి ఏకంగా పక్కనున్న సరస్సులోకి జారిపడింది. అలా చాలా చోట్ల చాలా సార్లు విమానాలు రన్ వే పై ల్యాండింగ్ కు వచ్చి జారిపోతున్నాయి. అయితే రెండేళ్ల క్రితం ఇలా జారిపోయిన విమానాల్లో ఏషియానా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం కూలి ఏకంగా 200 మంది చనిపోయారు.
అయితే తాజాగా జపాన్లో విమానం జారిపోయింది.. అయినా ఈ ప్రమాదంలో ఎవరూ మృతి చెందలేదు. జపాన్ లోని ఓ విమానం రన్వే మీద ల్యాండయిన తర్వాత జర్రున జారిపోయింది. దాంతో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ విషయాన్ని జపాన్ అధికార వార్తాసంస్థ ఎన్హెచ్కే తెలిపింది. ఈ కారణంగా హిరోషిమా విమానాశ్రయాన్ని మూసేయాల్సి వచ్చింది. దక్షిణ కొరియాలోని సియోల్ నుంచి 74 మంది ప్రయాణికులతో బయల్దేరిన ఏషియానా ఎయిర్లైన్స్కు చెందిన ఎయిర్బస్ 320 విమానం హిరోషిమా విమానాశ్రయానికి చేరుకుంది. తీరా అక్కడ రన్వే సరిగా లేకపోవడంతో జర్రున జారిపోయింది. దాంతో ప్రయాణికులను నేరుగా దించేందుకు వీలు కుదరక.. అత్యవసర మార్గాల ద్వారా బయటకు తీసుకురావాల్సి వచ్చింది. అయితే ఈ ప్రమాదానికి కారణం ఏంటో మాత్రం తెలియలేదు. మొత్తానికి ఇలా విమానాలు జారిపోతున్నాయి. విమానంలో కూర్చున్న వారి ప్రాణాలు అమాంతం గాలిలో కలిసిపోతున్నాయి. మరి దీనికి పరిష్కారం ఏంటో అధికారులు ఆలోచించాలి.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more