చిత్తూరు జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల మధ్య ఉద్రిక్త వాతావరణాన్ని నెలకొల్పింది. తమిళ కూలీలను కావాలనే కాల్చి చంపారంటూ తమిళనాట తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అందులో భాగంగా తమిళనాడులో ఉన్న ఆంధ్ర వాహనాలకు నిప్పు పెట్టడం, ఆంధ్రకు చెందిన ఆస్తులను ధ్వంసం చెయ్యడం ప్రారంభమైంది. దాంతో రెండు రాష్ట్రాల మధ్య రవాణా నిలిచిపోయింది. ఇక రెండు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల్లో అయితే మరీ ఉద్రిక్తత నెలకొంది. ఆంధ్రా నుండి ఎలాంటి వాహనాలు కానీ చివరకు మనుషులకు కూడా ప్రవేశం లేనంతగా పరిస్థితి మారింది.
అయితే తమను కాపాడతామని హామీ ఇస్తేనే తమిళనాడుకు బస్సు సర్వీసులను ప్రారంభిస్తామని ఏపీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. గత ఆరు రోజులుగా చిత్తూరు నుంచి తమిళనాడు వెళ్లాల్సిన బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సు సర్వీసుల పునరుద్ధరణ కోసం తమిళనాడు అధికారులతో ఏపీఎస్ఆర్టీసీ ఆర్టీసీ మంతనాలు జరుపుతోంది. కానీ, ఈ విషయంలో తమిళనాడు అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. చిత్తూరు జిల్లా శేషాచలం అడువుల్లో తమిళ కూలీల ఎన్కౌంటర్ను నిరసనగా తమిళనాడులో ఇంకా ఆందోళన కార్యక్రమాలు ఉధృతంగానే కొనసాగుతున్నాయి. దీంతో ఆందోళనల ముసుగులో బస్సుల పై దాడులు చేస్తే ఆర్టీసీకి తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆర్టీసీకి తమిళనాడుకు సర్వీసులను రద్దు చేయడంతో 3 కోట్ల రూపాయల మేర నష్టం వాటిలినట్టు అంచనా. మరో పక్క తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. రెండు రాష్ట్రాల గొడవల సంగతి ఏమో కానీ మా కష్టాలు ఆ శ్రీనివాసుడికి తెలుసు అంటూ శ్రీవారికి మొరపెట్టుకుంటున్నారు.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more