ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పై దృష్టిసారించారు. గత కొంత కాలంగా ఏపి రాజధాని నిర్మాణంపై బిజిబిజీగా ఉన్న చంద్రబాబు తెలంగాణ నేతల కోరికపై తెలంగాణలో సభలకు సిద్దమవుతున్నారు. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసే చర్యల్లో భాగంగా నెలకో జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సభలు ఏర్పాటు చేయిస్తున్న టీటీడీపీ నేతలు ఈసారి అందుకు మహబూబ్నగర్ జిల్లాను ఎంచుకున్నారు. ఈనెల 23న మహబూబ్నగర్ పట్టణంలో విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం పేరిట బాబుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే వరంగల్, కరీంనగర్ నగరాల్లో బాబు సభలను నిర్వహించిన దృష్ట్యా పార్టీకి ఒకప్పటి కంచుకోటగా భావించే పాలమూరులో భారీ ఎత్తున జనాన్ని తరలించి సభను విజయవంతం చేయాలని పార్టీ నేతలు నిర్ణయించారు.
ఏప్రిల్ 24న అధికార టీఆర్ఎస్ ప్లీనరీని హైదరాబాద్లో నిర్వహిస్తున్న దృష్ట్యా అంతకన్నా ఒకరోజు ముందు చంద్రబాబుతో తెలంగాణలో సభను ఏర్పాటు చేయడం ద్వారా పైచేయి సాధించాలన్నది టీటీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. టీఆర్ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ టీడీపీపైన, చంద్రబాబుపైన విమర్శలు చేసే అవకాశాలున్నాయని ఊహించిన తమ్ముళ్లు.. ఒకరోజు ముందే చంద్రబాబు చేత కేసీఆర్పై విమర్శలు చేయించాలని జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ప్రణాళిక వేసినట్లు సమాచారం. మొత్తానికి ఏపితో పాటు తెలంగాణలొనూ తమ ప్రాభల్యాన్ని మరింత పెంచుకోవాలని టిటిడిపి చేస్తున్న సభలు ఎంత వరకు మేలు చేస్తాయో చూడాలి.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more