జనాభా లెక్కల ప్రకారం భారతదేశం ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానంలో వున్న విషయం తెలిసిందే! దేశానికి స్వాతంత్ర్య వచ్చినప్పుడు కేవలం 30 కోట్లు మాత్రమే వుండే జనాభా.. ఇప్పుడు ఏకంగా 130 కోట్లకు చేరింది. గతంలోనే ప్రభుత్వాలు ఈ హద్దూఅదుపులేకుండా పెరిగిపోతున్న జనాభా సంఖ్యను తగ్గించేందుకు కుటుంబ నియంత్రణ అనే ప్రణాళికలు చేపట్టాయి. ముగ్గురు లేదా ఇద్దరు మాత్రమే పిల్లల్ని కనాలంటూ అప్పట్లో ఆయా ప్రభుత్వాలు నినాదాలు చేశాయి. అయినప్పటికీ జనాభా మాత్రం పెరుగుతూనే వస్తోంది. ప్రస్తుతం జనాభాలో రెండో స్థానంలో వున్న భారత్.. త్వరలోనే మొదటి స్థానంలో వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఈ నేపథ్యంలోనే తాజాగా వివాదాస్పద ప్రకటనలు చేయడంలో దిట్టైన బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్.. పెరిగిపోతున్న జనాభాను నియంత్రించేందుకు కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. ఆ చట్టాన్ని అనుసరించని వారి ఓటు హక్కును తీసేయాలని ఆయన చెబుతున్నారు. ఈ మేరకు ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘హిందువులు కుటుంబ నియంత్రణలో భాగంగా వేసక్తమీ, ట్యుబెక్టమీ ఆపరేషన్ చేయించుకుంటారు. ముస్లింలు కూడా దాన్నే ఎంచుకోవాలి. ఈ విషయంలో అందరికీ ఒకే చట్టం వుండాలి. దీన్ని ప్రభుత్వం త్వరగా అమలు చేయాలి’ అని ఆయన కోరారు.
ప్రస్తుతం దేశాన్ని జనాభా పెరుగుదలే కుదిపేస్తోందని.. అది పెద్ద సవాలుగా మారిందని ఆయన నొప్పి చెప్పారు. స్వాతంత్రం వచ్చినప్పుడు 30 కోట్లు వున్న జనాభా.. ఇప్పుడు 130 కోట్లకు చేరిందని ఆయన గుర్తుచేశారు. ఇలా జనాభా ఒక్కసారిగా పెరిగిపోవడానికి బాధ్యులెవరు? అంటూ ప్రశ్నించారు. దీంతో ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఎందుకంటే.. గతంలో ప్రతి ఒక్క హిందూ మహిళల నలుగురు పిల్లల్ని కనాలంటూ వ్యాఖ్యానించిన ఈయన.. ఇప్పుడు కుటుంబ నియంత్రణ గురించి మాట్లాడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి.. ఈ విషయం భవిష్యత్తుల్లో ఎన్ని వివాదాలకు తావిస్తుందోనని భావిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more