తెలుగుదేశం పిలుస్తోంది అని నారా చంద్రబాబు నాయుడు పిలుపునివ్వడం మనం గతంలోనే విన్నా.. కానీ ఈ మధ్య తెలుగుదేశం కాదు వేరే నినాదాన్ని ఎత్తుకున్నారు. తాజాగా ఏపి కొత్త రాజధాని అమరావతి పిలుస్తోందని అంటున్నారు చంద్రబాబు. అందులో భాగంగా అన్ని దేశాల నుండి అమరావతి పిలుస్తోంది.. పెట్టుబడులు పెట్టండి అంటూ పిలుపునిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతికి రావాలని, అపారమైన సహజ సిద్ధమైన వనరులకు ఆంధ్రప్రదేశ్ నిలయమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చైనా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. అమరావతిని అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్దుతామని, భారీ నిర్మాణాలు ఇక్కడ రానున్నాయని, సిమెంట్ ఉత్పత్తులకు ఆంధ్రాలో మంచి గిరాకీ ఉండబోతోందన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలు, సంస్థలకు ఎర్రతివాచీ పరుస్తామని, అన్ని పారిశ్రామిక అనుమతులను సింగిల్ డెస్క్ ద్వారా 21 రోజుల్లో అనుమతులు ఇస్తామని బాబు ప్రకటించారు. రాష్ట్రంలో పరిశ్రమలకు నిరంతర విద్యుత్ ఇస్తున్నామని ఏపి ముఖ్యమంత్రి వెల్లడించారు.
నూతన రాష్ట్రంలో 40 వేల కోట్ల రూపాయలతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టామని నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. చైనా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం చైనా రాజధాని బీజింగ్లో ఆ దేశానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలను కలుసుకుంది. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనువైన పరిస్థితులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చంద్రబాబు వివరించారు. సినోమా ఇంటర్నేషనల్ సంస్థ అధినేత సుషాన్ మాట్లాడుతూ సిమెంట్, పవన విద్యుత్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో సిమెంట్ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మొత్తానికి ఎన్నికల సమయంలో తెలుగుదేశం పిలిస్తే కొత్త రాష్ట్రానికి రావలసిందిగా అమరావతి పిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నారు.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more