పొగాకు ఉత్పత్తులు తీసుకుంటున్న వారు అంతకంతకు చావుకు దగ్గరవుతున్నారని అందరికి తెలుసు. అయితే పొగాకు ఉత్పత్తులను తీసుకుంటున్న వారి మరణాల సంఖ్యను చూస్తే మాత్రం అందరు విస్తుపోతున్నారు. ఎందుకంటే భయంకరమైన వ్యాధి సోకితే ఎలా ప్రజలు పిట్టల్లా రాలిపోతారో పొగాకు తీసుకుంటున్న వారు కూడా అలానే చని పోతున్నారు. ఇంతకీ ఎంతో తెలుసా ప్రతి 32 సెకన్లకు ఒకరు చావు ఒడిలో చేరుతున్నారు. అంటే దాదాపు ప్రతి అర నిమిషానికి ఒకరు చనిపోతున్నారని లెక్క. అలా ఏప్రిల్ నెల మొదటి ఐదు రోజుల్లో దేశవ్యాప్తంగా 12, 819 మంది చనిపోయారు. అయితే ప్రసపంచ వ్యాప్తంగా ఆరు పెద్ద పొగాకు ఉత్పత్తి కంపెనీలు పొందిన లాభం ఎంతో తెలుసా.. అక్షరాల నాలుగు లక్షల లక్షలు. అంటే సెకనుకు 87వేల రూపాయల లాభాలతో ఉన్నాయి.
పొగాకు ఉత్పత్తులను వాడటం వల్ల కలుగుతున్న మరణాలపై TobaccoAtlas.org చేసిన అధ్యయనంలో పొగాకు చీకటి కోణం వెలుగులోకి వచ్చింది. పొగాకు ఉత్తత్తులను వాడితే ప్రమాదకరం..క్యాన్సర్ కు కారకం అని పెద్ద పెద్ద అక్షరాలతో వార్నింగ్ ఇచ్చినా వాటిని లెక్క చెయ్యకుండా పొగ తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పొగాకు ఉత్తత్తి కంపెనీలు మాత్రం లాభాలే ధ్యేయంగా ఉత్తత్తులను తయారు చేస్తున్నాయి. అవి తాగిన వారు చనిపోతుంటే, కంపెనీలు మాత్రం లాభాలను గడిస్తున్నాయి. అలా పొగ తాగు వారు ప్రాణాలను కాల్చివేస్తు, కంపెనీలను లాభాల బాట పట్టిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సిగరెట్, బీడి లాంటి పొగాకు ఉత్పత్తులపై హెచ్చరిక సైజ్ ను పెంచాలని ఆలోచిస్తోంది. అయితే తాజా సర్వే మాత్రం ఖచ్చితంగా హెచ్చరిక సైజ్ ను పెంచాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. ఈ లెక్కలను బట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటో తెలుసుకోవచ్చు. ప్రభుత్వం కనీసం ఇప్పటికైనా పొగాకు ఉత్పత్తులపై కఠినంగా వ్యవహరిస్తుందేమో చూడాలి.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more