విఐపి విధానానికి మేం వ్యతిరేకం అని గొంతుచించుకున్న పార్టీ అధికారంలోకి వచ్చి 50 రోజులకే అప్పుడే విఐపి సంసృతిని పాటిస్తోంది. ఇంతకీ ఆ పార్టీ ఏంటా అని అనుకుంటున్నారా.. దేశంలో సంచనాలను సృష్టిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ. పార్టీ పాలసీల్లో ఒకటైన విఐపి సంసృతి వ్యతిరేకత ఇచ్చుడు గాలిలో కలిసింది. ఎందుకంటే పార్టీకి చెందిన ప్రముఖులకు, కొంత మంది వివిఐపిల కోసం పార్టీ చేసిన ఏర్పాట్లపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న వైఖరిపై తీవ్రంగా మండిపడ్డ ఆప్ ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పలేకపోతోంది.
ఢిల్లీ ప్రభుత్వం కొత్తగా యాంటీ కరప్షన్ హెల్ప్ లైన్ ను తాజాగా ప్రారంభించింది. అయితే ఈ కార్యక్రమానానికి పార్టీకి చెందిన వారితో పాటు పలువురు విఐపిలు, వివిఐపిలు కూడా హాజరయ్యారు. అయితే విఐపి సంసృతిని వ్యతిరేకించే ఆప్ పార్టీ విఐపిల కోసం ప్రత్కేకంగా ఎంట్రన్స్ లను ఏర్పాటు చేసింది. వారికి ప్రత్యేకంగా అతిథి మర్యాదలను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ వారు దీనిపై మండిపడుతున్నారు. అధికారంలోకి రాక ముందు అంతంత మాటలు చెప్పిన వారు ఇప్పుడు ఇలా చేస్తున్నారేంటా అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ ఏకంగా రెండు ఫోటోలను సాక్షంగా చూపిస్తూ, ఆప్ పై కామెంట్ చేస్తు ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశారు.
ఫోటోల్లో చూడండి.. 50 రోజుల్లో పార్టీ ఎలా విఐపి, వివిఐపి పార్టీగా మారిందో చూడండి అంటూ ట్వీట్ చేశాడు. దాంతో అజయ్ మాకెన్ ట్వీట్ పై, ఆప్ వ్యవహారంపై చర్చ సాగుతోంది. మొత్తానికి అధికారంలోకి రాక ముందు ఎన్ని మాటలు చెప్పినా అధికారంలోకి వచ్చాక మాత్రం అధికారం అలా మార్చేస్తుందేమో మరి.. ఆప్ దీనిపై ఏం సమాధానం ఇస్తుందో చూడాలి.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more