సూర్యపేట బస్టాండ్ లో జరిగిన కాల్పుల ఘటనలో విస్తు పోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులపైకి కాల్పులు జరిపింది దొంగలు అని ముందు అనుకున్నా, తరువాత మాత్రం కొన్ని అనుమానాలు కలిగాయి. ఈ ఉదయం ఇద్దరు దుండగులను కాల్చి చంపిన పోలీసులు వెల్లడించిన నిజాలు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. పోలీసులపై కాల్పులు జరిపిన వారు మామూలు వ్యక్తులు కాదు.. గతంలో ఎన్నో నేరాల్లో నిందితులుగా రికార్డులకెక్కారు. అయితే దేశంలో నిషేదాన్ని ఎదుర్కొంటున్న సెమీ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు కీలక ఉగ్రవాదులుగా పోలీసులు గుర్తించారు. సిమీ కు చెందిన ఉగ్రవాది అబూ ఫైజల్ గ్యాంగ్లో అస్లాం ఆయుబ్ , జాకీర్ హుస్సేన్ కీలకం. గతంలో మధ్యప్రదేశ్ ఖండ్వా జైలు నుంచి వీరిద్దరు పరారైనట్లు తెలుస్తోంది. కాగా, దుండగులు ఇద్దరిని ఇంకా ఉగ్రవాదులుగా గుర్తించలేదని, విచారణ కొనసాగుతుందని రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ పేర్కొన్నారు.
ముంబై యాంటీ టెర్రరిస్ట్ వాంటెడ్ లిస్ట్లోఅస్లం అయూబ్, జాకీర్ హుస్సే న్ పేర్లున్నాయి. 2014 అక్టోంబర్ కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎస్బీఐ బ్యాంకులో చోరీకి పాల్పడింది ఈ ముఠా సభ్యులే. మొత్తానికి సూర్యాపేట కాల్పులకు పాల్పడింది ఉగ్రవాదులు అని తేలిపోయింది. అందులో ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు మట్టుబెట్టారు. అయితే మొత్తం ఐదు మంది ఉన్న ఉగ్రవాద ముఠాలో ఇప్పటికి ఇద్దరు మాత్రం హతమయ్యారు. కాగా మిగిలిన ముగ్గురు ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారన్నది ప్రశ్నగా మారింది. ప్రస్తుతానికి సూర్యాపేట కాల్పుల ఘటనకు ముగింపు లభించిందని అందరూ అనుకునే సమయంలో ఇలా ఉగ్రవాదులు ఇంకా కొంత మంది బయట ఉన్నారని సమాచారం. దాంతో పోలీసుల పని మొదటికి వచ్చింది. మిగిలిన ఉగ్రవాదుల జాడ కోసం మరోసారి తమ నిఘా వ్యవస్థను అలర్ట్ చేసింది. మరి ఆ ఉగ్రవాదులను ఎప్పటికి పట్టుకుంటారో..
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more