ఇటీవలే కృష్ణాజిల్లా నందిగామకు చెందిన యువతి పూజిత హైదరాబాద్ పంజాగుట్ట ఐఏఎస్ కాలనీలో సజీవ దహనమైన సంగతి తెలిసిందే. ఈమె హైదరాబాద్ బయలుదేరడానికి ముందు తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్ రాసింది కూడా! దాంతో ఈ యువతి ఆత్మహత్య చేసుకుని వుంటుందని అంతా భావించారు. అయితే.. ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటే.. కృష్ణాజిల్లా నుంచి హైదరాబాద్ వచ్చి సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటి..? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
తొలుత పూజిత మృతి సమాచారం తెలియగానే కుటుంబసభ్యులు వ్యక్తం చేశారు కానీ.. ఆమె తండ్రి శ్రీనివాసరావు ఆ తర్వాతి పరిణామాలను బట్టి ఈ ఘటన వెనుక ఏదో కుట్ర దాగి వుందని అనుమానాలు వ్యక్తం చేశారు. మొత్తంగా పూజిత మరణంపై అన్ని కోణాల్లోనూ అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు ఈ కేసులో ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పూజితను అత్యాచారం చేసి ఆ తర్వాత చంపేసి ఉండొచ్చనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను కనుగొన్న పోలీసులు ఆ దిశగా తమ దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి పూజిత బాయ్ ఫ్రెండ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ దర్యాప్తులో భాగంగానే పూజిత ఫేస్బుక్ డీటైల్స్, మెసేజ్ చాటింగ్ విషయాలను తెలుసుకునేందుకు ‘ఫేస్ బుక్’ ప్రధాన కార్యాలయం నుంచి మొత్తం డేటాను తెప్పించుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఇక పూజిత స్నేహితుడుగా చెబుతున్న అక్షయ్, బీహార్ రాష్ట్రంలోని పోలీసు అధికారి కుమారుడు కావడం పలు అనుమానాలకు తావిస్తోందని వారు చెబుతున్నారు. బహిరంగ ప్రదేశంలో పూజిత కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడుతుంటే ఎవరూ గమనించక పోవటమేంటని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న పూజిత శరీరం ఆ స్థాయిలో తగులబడుతుందా..? అనేది మరో అనుమానంగా ఉంది. మరి.. దర్యాప్తులో ఎటువంటి విషయాలు వెల్లడవుతాయో వేచి చూడాలి!
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more