రాజధాని ప్రాంత రైతులు, రైతు కూలీలు, కౌలు రైతుల పరిస్థితులు, వారి వేదనలపై రాష్ట్ర అసెంబ్లీలో చర్చించేందుకు వైసీసీ చేసిన యత్నాలు అనుకూలించలేదు. రాజధాని రచ్చ రాజుకుందని అనుకునే లోపు అరిపోయింది. ఈ ప్రాంత ప్రజల బాధలపై శాసనసభలో చర్చ జరగాలని డిమాండ్ చేసిన ప్రతిపక్షం సభ వాయిదా వేయించడంలో సక్సెస్ అయ్యిందే కాని.. అంశాన్ని చర్చించడం ప్రస్తుతానికి అవసరం లేదన్న అధికార పక్షానిదే పైచేయిగా నిలిచింది. మార్చి 16న సెక్షన్ 344 కింద వాయిదా తీర్మాణం మేరకు రాజధాని అంశాన్ని చేపట్టాలని ప్రతిపక్ష నేత జగన్ కోరారు. వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో ఆయన మాట్లాడుతూ సీఆర్డీఏ బిల్లుపై మాత్రమే గత అసెంబ్లీలో చర్చ జరిగిందన్నారు.
గత సమావేశాల్లో రైతులు, రైతుకూలీలు, కౌలు రైతుల గురించి చర్చ జరగలేదన్నారు. ప్రతిపక్షం లేవెనెత్తిన అంశం ఇదివరకే అసెంబ్లీలో చర్చకు వచ్చిందని, మరో సారి అదే అంశంపై చర్చ జరపడం మంచిది కాదని స్పీకర్ కోడెల సూచించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజధానిపై చర్చను స్పీకర్ విజ్ఞతకే వదిలేస్తున్నట్లు జగన్ అన్నారు. రాజధాని ప్రాంతంలో రైతులను భయభ్రాంతులకు గురిచేశారని, వారిపై విపరీతమైన ఒత్తిళ్లు తీసుకొచ్చి బలవంతంగా భూసమీకరణ చేశారని ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు. రాజధాని ప్రాంతంపై ప్రభుత్వం చెప్పేదానికీ, వాస్తవ పరిస్థితులకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని, వీటిని సభ దృష్టికి తీసుకురావాల్సిందేనని స్పష్టం చేసింది. అత్యంత కీలక అంశం అయినందున దీనిపై చర్చించాలని గట్టిగా పట్టుబడుతూ మరోసారి సభను అడ్డుకుంది. దీంతో సభ రెండోసారి వాయిదా పడింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Jan 21 | తెలంగాణ అధికార పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు తనయ.. షేక్ పేట్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డీలు పరస్పరం బంజారాహీల్స్ పోలిస్ స్టేషన్లో పిర్యాదు చేసుకున్నారు. అదేంటి కేకే తనయ విజయలక్ష్మి... Read more
Jan 21 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం వాదనలతో ఏకీభవించని న్యాయస్థాన ధర్మాసనం రాష్ట్ర ఎన్నికల సంఘం వాదనలను బలపరుస్తూ రాష్ట్రంలో... Read more
Jan 21 | టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి కళా వెంకట్రావును అరెస్టు చేయలేదని, కేవలం విచారణకు మాత్రమే పిలిచామని విజయనగరం జిల్లా ఎస్పీ బి రాజకుమారీ తెలిపారు. రామతీర్థాన్ని టీడీపీ నేతలు సందర్శించిన రోజున జరిగిన ఘటనపై... Read more
Jan 21 | అగ్రరాజ్యం అమెరికా 46వ అధ్యక్షుడిగా డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి జోబైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా రెండో పర్యాయం బరిలో నిలిచిన డోనాల్డ్ ట్రంప్ ను గణనీయమైన ఓట్లతో ఓడించి.. ఆయన... Read more
Jan 21 | దేశ రాజధానిలో తన సత్తాను చాటిన అమ్ ఆద్మీ పార్టీ రెండో పర్యాయం కూడా అధికారంలోకి రాకముందే అటు పంజాబ్, ఇటు హర్యానా సహా పలు రాష్ట్రాల్లోనూ సత్తా చాటుకునేందుకు ప్రయత్నాలు కొనసాగించింది. పంజాబ్... Read more